శ్రీవారిని దర్శించుకున్న మహేష్‌ అండ్‌ టీమ్‌..

Published on Fri, 01/17/2020 - 08:57

సాక్షి, తిరుపతి : టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఈ సంక్రాంతికి విడుదలై కలెక్షన్‌ల వర్షం కురుపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం మహేష్‌ చిత్ర బృందంతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్నవారిలో మహేష్‌, నమ్రత, వారి పిల్లలు, విజయశాంతి, దిల్‌ రాజు, అనిల్‌ రావిపూడి, రాజేంద్రప్రసాద్‌, అనిల్‌ సుంకర, వంశీ పైడిపల్లి, ఆది శేషగిరిరావు ఉన్నారు.  ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికీ ఆశీర్వచనాలు అందజేశారు. శ్రీవారి దర్శనం కోసం గురువారం రాత్రే సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం తిరుమల చేరుకున్న సంగతి తెలిసిందే.

మరోవైపు ఈ చిత్రం విజయోత్సవ సభ శుక్రవారం సాయంత్రం హన్మకొండలోని జేఎన్‌ఎస్‌లో జరగనుంది. ఇందుకోసం శ్రేయాస్‌ మీడియా భారీ ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు తెలిపారు. 



Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ