కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!
Breaking News
ఆయనతో నటించాలని కోరిక: హీరోయిన్
Published on Sat, 08/19/2017 - 19:30
లక్ష్య సాధన కోసం తపించే వారు కొందరైతే, ఎలాంటి లక్ష్యం లేకుండా పని చేసేవారు మరికొందరు. మరి హీరోయిన్ కీర్తిసురేశ్ ఏ కోవకు చెందరో చూద్దాం. ఈ బ్యూటీ తొలి రోజుల నుంచే బహుభాష నటిగా గుర్తింపు పొందింది. హీరో అజిత్ తో నటించాలనే కోరిక ఉందని తన మనసులో మాట చెప్పారు. తొలుత మాతృభాష మలయాళంలో, ఆ తరువాత కోలీవుడ్, ఆపై టాలీవుడ్ అంటూ అతివేగంగా ఎదిగిన హీరోయిన్ ఈమె. తమిళంలో విక్రమ్ ప్రభుకు జంటగా కెరీర్ ప్రారంభించారు. ఆ తరువాత శివకార్తికేయన్, ధనుష్, విజయ్ అంటూ తన రేంజ్ను పెంచుకుంటూ పోతున్నారు.
అదేవిధంగా రజనీమురుగన్, రెమో, భైరవా సినిమాలతో విజయాల గ్రాఫ్ను పెంచుకుంటూ పోతోంది. ఇంతకీ హీరోయిన్గా నీ లక్ష్యం ఏమిటమ్మా అన్న ప్రశ్నకు ఈ రంగంలోకి రాకముందే హీరోయిన్ అవ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నానని, అది సాధించుకున్నానని చెప్పుకొచ్చింది. ధనుష్, విజయ్లతో కలిసి నటించారు.. ప్రస్తుతం సూర్యకు జంటగా తానాసేర్నం కూటం చిత్రంలో నటిస్తున్నారు.. తదుపరి లక్ష్యం అజితేనా అని అడిగిన ప్రశ్నకు.. అజిత్ అంటే తనకు చాలా ఇష్టం అని చెబుతోంది. ఆయనతో నటించాలన్న కోరిక ఉందని, అయితే అదే లక్ష్యం అని చెప్పనని అన్నారు.
అలాంటి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని, అందుకోసం ప్రత్యేకంగా ప్రయత్నాలేవీ చేయనని పేర్కొన్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని హీరోయిన్గా మంచి పేరు తెచుకోవాలన్నదే తన లక్ష్యమని కీర్తి చెప్పారు. ఈ బ్యూటీ తమిళం, తెలుగు భాషల్లో మహానటి సావిత్రి జీవిత చర్రితతో తెరకెక్కుతున్న మహానటి చిత్రంలో సావిత్రిగా నటిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా పవర్ స్టార్ పవన్కల్యాణ్తో ఒక చిత్రం, నాని సరసన మరో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
Tags