అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కొత్త కోణం చూస్తారు
Published on Wed, 05/06/2020 - 02:34
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ జితేంద్ర త్వరలోనే ఓ వెబ్ సీరిస్ ద్వారా తన అభిమానులను పలకరించనున్నారు. ప్రముఖ టీవీ సీరియల్స్ నిర్మాత, జితేంద్ర కుమార్తె ఏక్తా కపూర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న తాజా వెబ్ సిరీస్ ‘బారిష్ 2’. ఈ వెబ్ సిరీస్లో జితేంద్ర ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.
జీతూజీ గాంధీ అనే వజ్రాల వ్యాపారి పాత్రలో కనిపించబోతున్నారట. ‘‘మళ్లీ యాక్ట్ చేయడం భలే సరదాగా ఉంది. (2013లో వచ్చిన ‘మహాభారత్ ఔర్ బార్బరీక్’ సినిమాలో చివరిగా అతిథి పాత్రలో మెరిశారాయన. ‘బారిష్’ లాంటి సిరీస్తో వెబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. నా అభిమానులు, ప్రేక్షకులు ఈ పాత్రల్లో నాలోని విభిన్న కోణాలను చూసి ఆస్వాదిస్తారనుకుంటున్నాను’’ అన్నారు జితేంద్ర.
#
Tags