amp pages | Sakshi

సోషల్ మీడియాలో తారల సందేశం

Published on Tue, 08/15/2017 - 12:05

దేశ వ్యాప్తంగా 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు సినీ తారలు తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే సమంత ఇండిపెండెన్స్ డే సందర్భంగా తన సందేశాన్ని ట్వీట్ చేసింది. మనకున్న వెలకట్టలేని వరం స్వతంత్రం, ఆ స్వతంత్రాన్ని ఎప్పటికీ గౌరవించుకుందాం.. అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశాడు.

త్రివర్ణ పతాకం ఎప్పుడూ ఎంతో ఎత్తులో ఉండాలంటూ కాజల్ ట్వీట్ చేశారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొన్ని కవితలతో పాటు ఓ వీడియోనూ ట్వీట్ చేశారు. కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, తెలుగు హీరో సుమంత్,  సీనియర్ నటి సిమ్రాన్, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తో పాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ కోలీవుడ్ సినీ తారలు తన అభిమానులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేశారు.