amp pages | Sakshi

పద్మావతి ఎవరు..?

Published on Mon, 01/30/2017 - 18:17

న్యూఢిల్లీ: ‘పద్మావతి’ బాలివుడ్‌ సినిమా షూటింగ్‌ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీపై రాజ్‌పుత్‌ కర్ణి సేన కార్యకర్తలు దాడి జరపడంపై నేడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.  వారెందుకు దాడి చేశారు? అసలు పద్మావతి ఎవరు? ఆమెపై బన్సాలీ తీస్తున్న సినిమా ఏమిటీ? అది చారిత్రక సినిమానా, చరిత్రను వక్రీకరించే సినిమానా? అసలు వివాదం ఏమిటీ?

నిజానికి సమస్త చరిత్రలు సైతం వివాదాస్పదమే. చరిత్రలో నిలిచిపోయేటివి ఎక్కువగా విజేతలు రాసిన లేదా రాయించిన చరిత్రలవడమే అందుకు కారణం. రాజ్‌పుత్‌ రాజకుటుంబానికి చెందిన ‘పద్మావతి’ క్యారెక్టర్‌ కేవలం కల్పిత గాధనేది మెజారిటీ చరిత్రకారుల అభిప్రాయం. క్రీస్తు  శకం 13–14 శతాబ్దానికి చెందిన శక్తివంతమైన ముస్లిం రాజు అల్లావుద్దీన్‌ ఖిల్జీ,  చిత్తార్‌ నేటి చిత్తార్‌గఢ్‌ రాజు రావల్‌ రతన్‌ సింగ్‌ భార్య పద్మావతి అందచందాల గురించి కథకథలుగా విని ఆమెను మోహిస్తారు. ఆమెను పెళ్లి చేసుకోవడం కోసమే 1303లో చిత్తార్‌గఢ్‌ రాజ్యంపై దాడి చేసి రాజ్యాన్ని కైవసం చేసుకుంటారు. తన భర్తతో సహా తన రాజకుటుంబీకులు మరణించారన్న వార్త తెలిసి, తోటి అంత:పుర స్త్రీలతో కలసి రాణి పద్మావతి సామూహిక ఆత్మాహుతికి (నాడు సతి, జవహర్‌గా వ్యవహరించేవారు) పాల్పడుతుంది.