పాతికేళ్ల తర్వాత...!

Published on Mon, 05/27/2019 - 05:28

రాబోయే రెండేళ్లకు సరిపడ సినిమాలు బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ బ్యాంకులో ఉన్నాయి. వరుసగా సినిమాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ ౖడైరీని ఫుల్‌గా ఉంచుతున్నారు. తాజాగా మరో మరాఠి సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు అమితాబ్‌ బచ్చన్‌. ఈ చిత్రానికి మిలింద్‌ లేలేస్‌ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమా షూటింగ్‌ ముంబైలో ఇటీవల  మొదలైంది. విక్రమ్‌ ఘోఖలే ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఫ్యామిలీ డ్రామా అండ్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమాకు ‘ఏబీ అండ్‌ సీడీ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. అయితే దాదాపు పాతికేళ్ల తర్వాత మరాఠి సినిమాలో నటిస్తున్నారు అమితాబ్‌. 1994లో వచ్చిన ‘అకా’ సినిమాలో ఓ గెస్ట్‌ రోల్‌ చేసిన అమితాబ్, 2006లో ఓ మరాఠి సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. 2010 ‘విహిర్‌’ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించారు. అంతేకానీ నటించలేదు. ఇప్పుడు పాతికేళ్ల తర్వాత ఓ ఫుల్‌లెంగ్త్‌ రోల్‌తో మళ్లీ మరాఠి వెండితెరపై కనిపించబోతున్నారు అమితాబ్‌.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ