amp pages | Sakshi

వెండితెర మధుర జ్ఞాపకం

Published on Fri, 10/05/2018 - 01:00

‘‘సినిమా పరిశ్రమ మనకు సూటవ్వదు. మాయా ప్రపంచం’... హీరోయిన్‌ అవుతానన్నప్పుడు కన్నాంబ తల్లిదండ్రులు అన్న మాటలివి. అనుకున్నది సాధించాలనే పట్టుదలతో పెరిగిన అమ్మాయి. పద్ధతులు తెలిసిన అమ్మాయి కన్నాంబ. అందుకే అమ్మానాన్నకు మాటిచ్చింది... ‘ఎక్కడా తప్పటడుగు వేయను’ అని. ‘‘నేను ఎవరికీ లొంగను. మీరు తలవొంచుకునే పరిస్థితులు తీసుకు రాను. ఒకవేళ నేను తలవొంచే పరిస్థితి వస్తే నన్ను నేను చంపేసుకుంటాను’’... కూతురి మాటలు విన్న కన్నాంబ తల్లిదండ్రులు సినిమాల్లోకి వెళ్లడానికి అనుమతిచ్చారు.

‘పుసుపులేటి కన్నాంబ’.. 1934 నుంచి 1965 వరకు దక్షిణాదిన తిరుగు లేని తార. నేటి తరానికి ఈ అద్భుత నటిని పరిచయం చేయాల్సిందే. నేడు కన్నాంబ జయంతి. ఈ సందర్భంగా ఆమె మనవడు పసుపులేటి దేవీ చౌదరి తన అమ్మమ్మ గురించి చెప్పిన విశేషాల్లో కొన్ని ఈ విధంగా...


► కన్నాంబ పుట్టింది (1912) ఏలూరు. పెరిగింది గుంటూరులో. పెద్ద కుటుంబం. పేరున్న కుటుంబం. తండ్రి తోడబుట్టినవాళ్లు 17 మంది. కుటుంబం మొత్తానికి కన్నాంబ ఒక్కతే కూతురు. మిగతావాళ్లంతా మగపిల్లలే. అమ్మానాన్న, పెదనాన్నలు, బాబాయ్‌ల మధ్య అల్లారు ముద్దుగా పెరిగింది. ఐదో తరగతి వరకూ చదువుకున్న కన్నాంబకు వీధి నాటకాలు చూడటం ఇష్టం. బయట నాటకం చూడటం, ఇంటికొచ్చాక ఆ డైలాగులు చెప్పి, ఇంటిల్లిపాదినీ నవ్వించడం. 11వ ఏట నాటకాలు చూడటం మొదలుపెట్టి, ఆ తర్వాత ‘నావెల్‌ నాటక సమాజం’లో చేరి, బాల తారగా పలు పాత్రలు చేసింది. 1935లో ‘హరిశ్చంద్ర’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు కన్నాంబ. ఆ చిత్రంలో హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి పాత్ర చేశారామె. తొలి చిత్రంలోనే అద్భుతమైన నటన కనబర్చి మంచి పేరు తెచ్చుకున్నారు.


► మొదటి సినిమా తర్వాత కన్నాంబ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘ద్రౌపది వస్త్రాపహరణం, కనకతార, పల్నాటి యుద్ధం, అనార్కలి, దక్షయజ్ఞం, తోడి కోడళ్లు’ తదితర చిత్రాల్లో నటించారామె. కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో సుమారు 70 సినిమాలు, క్యారెక్టర్‌ నటిగా వంద సినిమాల వరకూ చేశారామె. కన్నడ సినిమాలు కూడా చేశారు. కన్నాంబ మంచి నటి మాత్రమే కాదు.. మంచి గాయని కూడా. ‘చండిక’ సినిమాలో చేతిలో కత్తిపట్టుకుని, గుర్రం మీద వెళుతూ ‘నేనే రాణినైతే..’ అనే పాటలో కన్నాంబ కనబర్చిన అభినయానికి అప్పటి తరం ‘భేష్‌’ అనకుండా ఉండలేకపోయింది. నటించడం మాత్రమే కాదు.. ఆ పాటను కన్నాంబ  అద్భుతంగా పాడారు.
 
► చక్కని రూపం, గంభీరమైన స్వరం, కనుబొమలతో అవలీలగా హావభావాలు పలికించగల నైపుణ్యం కన్నాంబను అగ్ర తారను చేశాయి. ముఖ్యంగా శక్తిమంతమైన పాత్రల్లో ఆమె శారీరక భాష చాలా ఠీవీగా ఉండేది. అందుకు ఓ ఉదాహరణ తమిళ చిత్రం ‘కన్నగి’. మహా పతివ్రత కన్నగి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో కన్నాంబ నటవిశ్వరూపం చూస్తాం. ఆ సినిమాలో ఆమె రాజనర్తకి కన్నగిగా నటించారు. భర్తపై దోషిగా ముద్ర వేసి, మరణిశిక్ష విధించిన రాజును నిలదీస్తుంది. కన్నగి ప్రాతివత్య మహిమ ఆ మధుర పట్టణాన్నే దహించివేస్తుంది. ఆ సన్నివేశాల్లో కన్నాంబ కళ్లు నిప్పులు కురిపించాయి. తమిళంలో కన్నాంబకు ఇది మూడో సినిమా. అక్కడ స్టార్‌ని చేసిన సినిమా కూడా ఇదే. తెలుగులో కన్నగి జీవితం ఆధారంగా స్వీయదర్శకత్వంలో గూడవల్లి రామబ్రహ్మం తీసిన ‘పత్ని’లోనూ కన్నాంబ టైటిల్‌ రోల్‌ చేశారు.

► కన్నాంబ కెరీర్‌ సాఫీగా సాగలేదు. అప్పటి ఓ ప్రముఖ తమిళ నటుడు ఈవిడకు సమస్య అయ్యాడు. కన్నాంబను లొంగదీసుకోవాలన్నది అతని లక్ష్యం. ‘ఎవరికీ లొంగను. ఎవరి దగ్గరా తలవంచను’ అని తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ అంటూ పలువురు కథానాయికలు తమకు ఎదురైన చేదు అనుభవాలను చెబుతున్నారు. అప్పట్లో కన్నాంబకు జరిగింది కూడా ఇదే. ఆ నటుడిని ఎదిరించినందుకు గాను ఆమెకు మెల్లిగా అవకాశాలు తగ్గాయి. చివరికి ఆ నటుడు కన్నాంబ భర్తనూ వదిలిపెట్టలేదు. కన్నాంబ భర్త కడారు నాగభూషణం సినీ నిర్మాత, దర్శకుడు కూడా. ఈ ఇద్దరూ  పెళ్లి చేసుకున్నాక ‘శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం’ కంపెనీ స్థాపించి పలు తెలుగు, తమిళ చిత్రాలు నిర్మించారు. వాటిలో ‘సుమతి, పాదుకా పట్టాభిషేకం, సతీ సక్కుబాయి, శ్రీకృష్ణతులాభారం’ తదితర చిత్రాలున్నాయి ఈ చిత్రాలకు  కడారు నాగభూషణమే దర్శకుడు. బయటి దర్శకులతోనూ సినిమాలు తీశారు. భర్త దర్శకత్వంలో కన్నాంబ నటించారు కూడా.

► కన్నాంబ, నాగభూషణంలు మంచితనానికి చిరునామా అన్నట్లుగా ఉండేవాళ్లట. అడిగినవాళ్లకు కాదనకుండా డబ్బు ఇవ్వడం, సాక్షి సంతకం పెట్టడం లాంటివి వీళ్లకు నష్టాన్ని కలిగించాయి. ఏ నటుడి వల్ల అయితే అవకాశాలు కోల్పోయారో అదే నటుడితో ఓ సినిమా తీసి, నష్టాలపాలయ్యారు. ఆ నటుడితో రెండు మూడు సినిమాలను తమ బేనర్లో నిర్మించడానికి కన్నాంబ, నాగభూషణంలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫస్ట్‌ సినిమా తీసినప్పుడు తన స్నేహితుడి బేనర్‌కి ఆ సినిమాని ఇవ్వమని నటుడు కోరితే కాదనకుండా ఇచ్చేశారు. అయితే 30 మాత్రమే చెల్లించి, మిగతా 70 శాతం ఇవ్వకపోయినా కన్నాంబ దంపతులు అతనితో రెండో సినిమా తీయడానికి సిద్ధపడ్డారు. ఆ సినిమా సగంలో ఉండగానే అతనికి రాజకీయాల వైపు మక్కువ ఏర్పడి, మిగతాది పూర్తి చేయకపోవడంతో నష్టం మిగిలింది. ‘‘ఏ వ్యక్తి  మీద అయినా వారి జీవితాన్ని నాశనం చేసేంత కోపం ఉండకూడదు. కానీ మా అమ్మమ్మపై ఆ నటుడు పగబట్టాడు. ఆమె కెరీర్‌ని నాశనం చేయడంతో పాటు మా తాతగారికీ అవకాశాలు లేకుండా చేశాడు’’ అని కన్నాంబ మనవడు పసుపులేటి దేవీ చౌదరి అన్నారు.

► అప్పట్లో కన్నాంబ ప్రొడక్షన్‌ హౌస్‌లో పని చేసేవారందరూ సంతోషంగా ఉండేవారట. నెల ఆరంభమయ్యే ముందు రోజే అందరికీ జీతాలు ఇచ్చేసేవారట. అలాగే ఉదయం ఆరేడు గంటల ప్రాంతంలో టిఫిన్‌తో మొదలై, రాత్రి 12 గంటల వరకూ వచ్చినవారికి లేదనకుండా భోజనం పెట్టేవారట. కన్నాంబ పేరు మీద చెన్నైలో ఓ స్టూడియో కూడా ఉండేది. షూటింగ్స్‌తో స్టూడియో కళకళలాడేది. ఆ తర్వాత మోసం చేసి, ఎవరో ఆ స్టూడియోను తమ పేరు మీద రాయించేసుకున్నారు.

► ‘ఆత్మబలం’ (1964) కన్నాంబ చివరి సినిమా. అదే ఏడాది మే 7న ఆమె తుది శ్వాస విడిచారు. ఏ అనార్యోగమూ లేదు. బతికున్న రోజుల్లో జ్వరం అనేది ఎరగని కన్నాంబ ప్రశాంతంగా కన్ను మూశారు. అయితే దురదృష్టం ఏంటంటే.. మనిషి చనిపోయాక కూడా ఆ నటుడు పగ తీర్చుకున్నాడని దేవీ చౌదరి అంటున్నారు. కన్నాంబ భౌతికకాయాన్ని ఖననం చేశారు. అక్కడ సమాధి కట్టించాలన్నది కుటుంబ సభ్యుల ఆలోచన. అయితే ఈలోపే శవం మాయమైంది. శరీరం మీద ఉన్న నగల కోసం దొంగలే మాయం చేశారని కొందరు అంటే, కాదు ఇది ఆ నటుడి పనే అని మనవడు అంటున్నారు. ఏం జరిగిందో దేవుడికే ఎరుక.

► కన్నాంబ మరణించాక ఆమె భర్త నాగభూషణం బాగా కుంగిపోయారు. అప్పటికి ఆస్తులు కూడా పోవడంతో చివరి రోజుల్లో ఆయన సాదాసీదా జీవితం గడిపారు. ‘అమ్మమ్మ, తాతయ్యలకు దానగుణం ఎక్కువ. ఆ మంచితనమే వాళ్లను ఇబ్బందులను చేసింది. మాకు వాళ్ల పేరే ఆస్తి’ అన్నారు దేవీ.

► నటిగా, వ్యక్తిగా కన్నాంబ నేటి తరానికి ఆదర్శం. ఆమె ఎంతో క్రమశిక్షణ ఉన్న నటి. పట్టుదల గల వ్యక్తి. అవకాశాలు పోయినా ఫర్వాలేదు.. గుణం ముఖ్యమని నిలబడ్డ స్త్రీ.

కన్నాంబ.. వెండితెర మధుర  జ్ఞాపకం.. చరిత్రలో నిలిచిపోయే అద్భుతం.

– డి.జి. భవాని

అమ్మమ్మ పేరు మీద ‘కన్నాంబ పసుపులేటి మూవీస్‌’ బేనర్‌ ఆరంభించాను. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం, తెలుగు, హిందీ భాషల్లో మరో ద్విభాషా నిర్మించడానికి ప్లాన్‌ చేస్తున్నాను. ఈ చిత్రాల్లో నేనే హీరోగా నటించబోతున్నా.
-
పసుపులేటి దేవీ చౌదరి


పసుపులేటి దేవీ చౌదరి, కన్నాంబ

Videos

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం

సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..

జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్టు..బాబుది బోగస్ రిపోర్టు

కూటమి బండారం మేనిఫెస్టో తో బట్టబయలు

బాబు, పవన్ తో నో యూజ్ బీజేపీ క్లారిటీ..

పచ్చ బ్యాచ్ బరితెగింపు...YSRCP ప్రచార రథంపై దాడి

నేడు మూడు చోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచార సభలు

Photos

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)