రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మార్వాడీలకు పరిశుభ్రతంటే తెలియదు
Published on Sat, 01/06/2018 - 01:44
నంద్యాల అర్బన్: ‘మార్వాడీలకు పరిశుభ్రతంటే తెలియదు. ఇళ్లలోని చెత్తా చెదారాన్ని మురుగు కాలువల్లో వేస్తూ అపరిశుభ్రతకు కారణమవుతున్నారు’ అని శాసనమండలి చైర్మన్ ఎన్ఎండీ ఫరూక్ వ్యాఖ్యానించారు. కాలువలు చెత్తతో నిండి మురుగునీరు రోడ్లపైకి వస్తోందని, ఇందుకు కారణమైన మార్వాడీలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.
కర్నూలు జిల్లా నంద్యాలలోని 9వ వార్డులో జరిగిన ‘జన్మభూమి–మాఊరు’ కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడారు. పరిశుభ్రతకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు కొందరు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు.బైర్మల్ వీధిలోని తన ఇంటి పరిసరాల్లో ఉంటున్న మార్వాడీలు చెత్తంతా మురుగు కాలువల్లో వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన మార్వాడీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
#
Tags