amp pages | Sakshi

నార్త్‌ కొరియాకు అమెరికా, ద. కొరియా విజ్ఞప్తి!

Published on Thu, 06/25/2020 - 15:15

సియోల్‌: ఉత్తర కొరియా 2018 నాటి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని దక్షిణ కొరియా, అమెరికా గురువారం విజ్ఞప్తి చేశాయి. తద్వారా కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొంటుందని పేర్కొన్నాయి. కొరియా యుద్ధం(జూన్‌ 25, 1950) మొదలై నేటికి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమెరికా, దక్షిణ కొరియా.. తమ దేశ రక్షణ మంత్రులు మార్క్‌ ఎస్సర్‌, జియోంగ్‌ కియోంగ్‌-డూ పేరిట సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అమెరికా- ఉత్తర కొరియాల మధ్య సింగపూర్‌లో కుదిరిన ఒప్పందంపై సంతకం చేసిన నార్త్‌ కొరియా దానికి కట్టుబడి ఉండాలని కోరాయి. అదే విధంగా తమ రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటూ.. బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని పేర్కొన్నాయి.

కాగా అనేక సవాళ్లు- పరిణామాల అనంతరం 2018, జూన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, నార్త్‌ కొరియా సుప్రీంలీడర్‌ కిమ్‌ జోంగ్‌‌ ఉన్‌‌ల మధ్య సింగపూర్‌లో చారిత్రాత్మక భేటీ జరిగిన విషయం తెలిసిందే. కొరియా ద్వీపకల్పంలో శాంతి, స్థిరత్వం నెలకొల్పడంతో పాటు అణు నిరాయుధీకరణ కోసం ఇరుదేశాలు శత్రుత్వం నుంచి బయటకు వచ్చి పరస్పర అవగాహనతో ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు కిమ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మరో రెండుసార్లు ఇద్దరు భేటీ అయ్యారు.(అమెరికా తీరుపై ఉత్తర కొరియా అసహనం!)

ఉత్తర కొరియా హెచ్చరికలు
గత కొన్ని రోజులుగా దక్షిణ కొరియాపై ఉ. కొరియా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉభయ కొరియాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఇరు దేశాల మధ్య కుదిరిన మిలిటరీ ఒప్పందం నుంచి తప్పుకొంటామని హెచ్చరిస్తోంది. అదే విధంగా..  సింగపూర్‌ భేటీకి రెండేళ్లు పూర్తైన సందర్భంగా.. అమెరికా విధానాలు తమకు హాని చేసేవిగా ఉన్న కారణంగా ఆ దేశంతో బంధం కొనసాగించడంపై పునరాలోచన చేసే అవకాశం ఉందని ఉత్తర కొరియా పేర్కొంది.

అంతేగాక అమెరికా అధ్యక్ష ఎన్నికలు సాఫీగా జరగాలంటే తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో తమ ప్రజలకు వాషింగ్టన్‌తో దీర్ఘకాలిక ముప్పు పొంచి ఉన్నందున.. వారికి దీటుగా బదులిచ్చేందుకు తమ సైనిక వ్యవస్థను మరింత పటిష్ట పరచుకునేందుకు సిద్ధమైనట్లు విదేశాంగ మంత్రి రీ సర్‌ గ్వాన్‌ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో శాంతిని ఆకాంక్షిస్తూ అమెరికా- దక్షిణ కొరియా ప్రకటన విడుదల చేయడం విశేషం. (సోదరి ఆదేశాలు.. సైనిక చర్య వద్దన్న కిమ్‌!)

కొరియన్‌ యుద్ధం..
ఇక 1950-53 మధ్య జరిగిన కొరియన్‌ యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. దాదాపు 1,35,000 ఉత్తర కొరియా బలగాలు దక్షిణ కొరియాపై దండెత్తాయి. ఆ సమయంలో అమెరికా సహా 16 దేశాలు ద. కొరియాకు అండగా నిలవగా.. చైనా ఉ. కొరియాకు మద్దతునిచ్చింది. అనేక పరిణామాల అనంతరం జూలై 27, 1953 ఘర్షణ తొలగిపోయినప్పటికీ అధికారికంగా యుద్ధం ముగిసినట్లు మాత్రం ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో 2018లో ద. కొరియా అధ్యక్షుడు మూన్‌ జే-ఇన్‌, ఉ. కొరియా సుప్రీంలీడర్‌ కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో చర్చలకు సిద్ధమయ్యారు. మూడు దఫాలుగా సమావేశమై ఒప్పందం(కాల్పుల విరమణ) కుదుర్చుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.(దక్షిణ కొరియాకు కౌంటర్‌ ఇచ్చేందుకు సిద్ధం)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)