More

పేలిన బాంబు: మృతుల్లో జిల్లా కలెక్టర్

23 May, 2015 14:28 IST
పేలిన బాంబు: మృతుల్లో జిల్లా కలెక్టర్

కందహర్: బాంబు పేలుడులో జిల్లా కలెక్టర్తోపాటు ఆయన భద్రత సిబ్బంది మరణించారు. ఈ సంఘటన ఆఫ్ఘానిస్థాన్లోని చెర్చినోలో శనివారం చోటు చేసుకుంది. చెర్చినో జిల్లా కలెక్టర్ మహ్మమద్ ఇస్మాయిల్ హక్యార్... భద్రత సిబ్బందితో కలసి కార్యాలయానికి వెళ్తుండగా రహదారి పక్కనే అమర్చిన బాంబు పేలిందని ఉర్వజ్గన్ ప్రావెన్స్ గవర్నర్ మహ్మద్ నయాబ్ వెల్లడించారు.

ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారని చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో కలెక్టర్ హక్యార్ స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇంత వరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

2100 నాటికి ప్రపంచ జనాభాలో భారీ తగ్గుదల? భారత్‌, చైనా పరిస్థితి ఏమిటి?

నేను భారతీయురాలినైతేనా..? నితీష్ వ్యాఖ్యలపై అమెరికా సింగర్ ఫైర్

దుబాయ్‌లో దీపావళికి ఏం చేస్తారు? బుర్జ్‌ ఖలీఫాలో ఏం జరుగుతుంది?

సిరియాలో అమెరికా దాడులు.. 9 మంది మృతి

చైనా జిత్తులకు అమెరికా, భారత్‌ పైఎత్తు!