పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన పాక్‌

Published on Tue, 02/19/2019 - 14:11

లాహోర్‌ : పుల్వామా ఉగ్రదాడిపై పాకిస్తాన్‌ స్పందించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్‌ తమను నిందిస్తుందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తెలిపారు. ఈ ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఘటన జరిగిన 5 రోజుల తర్వాత ఇమ్రాన్‌ ఖాన్‌ స్పందించారు. భారత్‌ వద్ద సాక్ష్యాలు ఉంటే చూపించాలని, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తామూ ఉగ్రవాదుల బాధితులమేనని, ఉగ్రకార్యకలాపాలతో ఇబ్బందుల ఎదుర్కొంటున్నామన్నారు. ఈ ఉగ్రదాడి దర్యాప్తులో భారత్‌కు పూర్తిగా సహకరిస్తామన్నారు. ఉగ్రవాదంపై చర్చలకు పాక్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.

కశ్మీర్‌ సమస్య సైనిక చర్యతో పరిష్కారం కాదని, చర్చలతోనే ఈ వివాదాన్ని పరిష్కరించవచ్చని అభిప్రాయపడ్డారు. భారత్‌ తమపై దాడి చేయాలని భావిస్తే...దీటుగా ఎదుర్కొంటామన్నారు. భారత్‌లో ఎన్నికల ఏడాది కనుకనే ఈ ఉగ్రదాడి విషయంలో పాక్‌ను నిందిస్తున్నారని పేర్కొన్నారు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ