amp pages | Sakshi

చైనాపై మోజు.. భారత్‌కు షాక్‌!

Published on Sat, 08/11/2018 - 09:46

న్యూఢిల్లీ : మాల్దీవులపై ఆధిపత్యాన్ని చాటుకునేందుకు పోటీపడుతున్న చైనా.. భారత్‌పై పైచేయి సాధించే దిశగా చేసిన ప్రయత్నాలు సఫలమైనట్లుగా కన్పిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా భారత్‌ సాయంతో లబ్ధిపొందిన మాల్దీవులు ఇప్పుడా మిత్రధర్మాన్ని తుంగలో తొక్కేందుకు సిద్ధమవుతోంది. చైనాకు దగ్గరయ్యేందుకు తహతహలాడుతున్న మాల్దీవులు ప్రభుత్వం.. భారత్‌ను క్రమంగా దూరం పెడుతోంది. ఇప్పటికే దాయాది పాకిస్థాన్‌తో ఓ విద్యుత్‌ ప్రాజెక్టు కోసం ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే భారత్‌ ఇచ్చిన మిలిటరీ హెలికాప్టర్లు,  సైన్యం తమకు అక్కరలేదని తెగేసి చెప్తోంది. 

మిత్రధర్మాన్ని చాటుతూ గతంలో గడ్డు పరిస్థితుల్లో మాల్దీవులు ఉన్నప్పుడు భారత్‌ ఈ సాయాన్ని అందజేసింది. తాజాగా ఈ హెలికాప్టర్లు, సైన్యం వెనక్కి తీసుకోవాలంటూ భారత ప్రభుత్వాన్ని మాల్దీవులు కోరింది. సముద్రతలంపై నిఘా, తప్పిపోయిన నౌకలను వెతికేందుకు ఉద్దేశించిన హెలికాప్టర్లను అందించేందుకు గతంలో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.

మా సొంతంగా తయారు చేసుకోగలం..
భారత్‌లో మాల్దీవుల రాయబారి అహ్మద్‌ మహ్మద్‌ మాట్లాడుతూ.. భారత్‌కు సంబంధించిన రెండు మిలిటరీ హెలికాప్టర్లను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరామన్నారు. ఇన్నాళ్లుగా వైద్య సేవల కోసం ఉపయోగించుకుంటున్న ఈ రెండు హెలికాప్టర్లతో ఇక పనిలేదని, తాము సొం‍తంగా ఇటువంటి హెలికాప్టర్లను తయారు చేసుకునే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. భారత్‌ కుదిరిన ఒప్పందం జూన్‌లోనే ముగిసిపోయిందన్న అహ్మద్‌.. ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదని తెలిపారు. హెలికాప్టర్లతో పాటుగా ఇన్నాళ్లుగా మాల్దీవుల్లో మోహరించిన 50 మంది మిలిటరీ అధికారుల(పైలట్లు, సహాయక సిబ్బంది సహా) వీసాల గడువు ముగిసినందున వారిని కూడా తిరిగి భారత్‌కు పంపించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటికీ అక్కడే ఉన్నాయి..
భారత్‌కు చెందిన మిలిటరీ హెలికాప్టర్లు, సిబ్బంది ఇప్పటికీ మాల్దీవుల్లోనే ఉన్నాయన్నని  భారత నైకాదళ అధికార ప్రతినిధి తెలిపారు. మాల్దీవులతో ఉన్న ఒప్పందాన్ని కొనసాగించే విధంగా విదేశాంగ శాఖ చర్చలు జరుపుతోందని పేర్కొన్నారు. కాగా ఈ విషయం గురించి విదేశాంగ శాఖ ఇంతవరకు స్పందించలేదు.

చైనా ప్రోద్బలంతోనేనా?
భారత్‌కు రక్షణపరంగా ఎంతో వ్యూహాత్మకంగా ఉన్న మాల్దీవుల్లో 1100లకు పైగా దీవులు ఉన్నాయి. ఈ కారణంగా మాల్దీవులకు భారత్‌ ఎప్పటినుంచో రక్షణ కల్పిస్తూ వస్తోంది. అయితే, మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్‌ యమీన్‌ గయూమ్‌ గద్దెనెక్కిన నాటి నుంచి చైనాతో సంబంధాలకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే కొన్ని దీవులను చైనాకు లీజుకు కూడా ఇచ్చారు. అలాగే పాకిస్తాన్‌తో కూడా సరికొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.

ఎమర్జెన్సీ సమయంలోనూ..
మాల్దీవుల్లో 45 రోజుల పాటు ఎమర్జెన్సీ(ప్రతిపక్ష నేతలను విడుదల చేయయాలంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన తర్వాత) విధించిన సమయంలోనూ భారత్‌ మధ్యవర్తిత్వాన్ని ఆ దేశం తిరస్కరించింది. అంతేకాకుండా ఎమర్జెన్సీ ఎత్తివేత అనంతరం పాకిస్తాన్‌​ సైన్యాధికారి జావేద్‌ బాజ్వాను తమ దేశంలో పర్యటించాలంటూ ఆహ్వానించింది. చైనా పెట్టుబడులకు ప్రోత్సాహం అందించబోతున్నామని, ఈ సమయంలో చైనా, భారత్‌లతో సంబంధాల విషయంలో వచ్చే సమస్యలపై కూడా తమ దేశానికి అవగాహన ఉందని ఆ దేశ ప్రతినిధులు ప్రకటనలు కూడా చేశారు. కాగా ప్రస్తుతం భారత్‌తో మాల్దీవులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే చైనా విజయం సాధించినట్లుగానే కన్పిస్తోందని అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)