అమెరికాలో టోర్నెడో.. 23 మంది మృతి

Published on Tue, 03/05/2019 - 08:57

బ్యూరీగార్డ్‌: అమెరికాలోని అలబామా రాష్ట్రాన్ని టోర్నెడో వణికిస్తోంది. ఆగ్నేయ అలబామాలో టోర్నెడో ధాటికి 23 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. తుపాను ధాటికి జార్జియా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. డ్రోన్ల సాయంతో ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించి కాపాడుతున్నామని చెప్పారు. గాయపడిన చాలా మందిని ఆస్పత్రులకు తరలించారు.

టోర్నెడోల ప్రభావం అలబామాలో ఎక్కువగా ఉంది. టోర్నెడో ధాటికి పలు చోట్ల ఇళ్లు నేలకూలాయి. వందల సంఖ్యలో చెట్లు నెలకొరిగాయి. టోర్నెడో కారణంగా గంటకు 170 మైళ్ల వేగంతో గాలులు వీచాయని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. సహాయక కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హామీయిచ్చారని అలబామా గవర్నర్‌ తెలిపారు.


టోర్నెడో బీభత్సం

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ