వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెల్ఫోన్ చెంత ఉంటే మెదడు డీలా
Published on Fri, 11/17/2017 - 12:48
వాషింగ్టన్ : స్మార్ట్ఫోన్ వచ్చాక జీవితం సుఖమయం అయిందని అనిపిస్తోంది. కానీ, ఈ సౌఖ్యాల మాటున ప్రమాదాలూ పొంచి ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఫోన్ చెంతనే ఉంటే ఏకాగ్రత దెబ్బతింటుందని, మెదడు పనితీరును ప్రభావితం చేస్తుందని తాజా అధ్యయనంలో తేలిందట! యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు కొంతమంది వలంటీర్లపై ప్రయోగాత్మకంగా పరీక్షలు జరిపి ఈ విషయాన్ని నిర్దారించుకున్నారు.
ఇందులో భాగంగా 800 మంది మొబైల్ఫోన్ యూజర్లను ఎంపిక చేశారు. వలంటీర్ల పనితీరును, మొబైల్ అందుబాటులో ఉన్నపుడు (దానిని ఉపయోగించకపోయినా సరే) పనిలో, ఏకాగ్రతలో కలిగే మార్పులను పరిశీలించగా తాము ఈ విషయాన్ని గమనించినట్లు పరిశోధకులు వివరించారు.
#
Tags