amp pages | Sakshi

ఒక్కరోజే 254 మంది మృతి

Published on Fri, 02/14/2020 - 03:47

బీజింగ్‌/న్యూఢిల్లీ: కోవిడ్‌–19(కరోనా వైరస్‌) రోజు రోజుకీ విజృంభిస్తోంది. కరోనా వైరస్‌ మొదటిసారిగా బయటకొచ్చి చైనాలోని హుబాయి ప్రావిన్స్‌లో రోజు రోజుకి మృతుల సంఖ్య పెరిగిపోతోంది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 254 మంది మరణించారు. ఇప్పటివరకు వ్యాధి బారిన పడి 1,367 మంది మరణించారు. తాజాగా మరో ఇద్దరు భారతీయులకి కోవిడ్‌ వ్యాధి సోకినట్టు అనుమానిస్తున్నారు. బ్యాంకాక్‌ నుంచి భారత్‌కు వచ్చిన హిమాద్రి బర్మన్, నగేంద్ర సింగ్‌ అనే ఇద్దరు వ్యక్తులకు ఈ వైరస్‌ సోకిందని అనుమానాలున్నాయని కోల్‌కతాలోని ఎన్‌ఎస్‌సీబీఐ విమానాశ్రయం డైరెక్టర్‌ కౌషిక్‌ భట్టాచార్జీ వెల్లడించారు. బెలియాఘాటా ఐడీ ఆస్పత్రిలో వారిద్దరినీ అందరికీ దూరంగా వారిని ఉంచి చికిత్స అందిస్తున్నారు.

మంత్రుల బృందం సమీక్ష
కరోనా వైరస్‌ తన ప్రతాపం చూపిస్తుండడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి మంత్రుల బృందం పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. గురువారం నాడు వీరంతా సమావేశమై భారత్‌లో వైరస్‌ విస్తరణ, దానిని ఎదుర్కోవడానికి అవసరమైన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సమావేశానంతరం కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు కేరళలో మూడు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయని స్పష్టం చేశారు. కోల్‌కతాలో ఎవరికీ వ్యాధి నిర్ధారణ కాలేదని ఆ వ్యాధి లక్షణాలు ఉన్నవారిని ప్రత్యేక ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నామన్నారు.

కొత్త విధానంతో పెరిగిన కేసులు  
చైనాలో రాత్రికి రాత్రి కోవిడ్‌ కేసులు అసాధారణంగా పెరిగిపోవడానికి కారణాలున్నాయి.ఇన్నాళ్లూ కరోనా వైరస్‌ను గుర్తించడానికి వైరాలజీ ల్యాబ్‌లో న్యూక్లిక్‌ యాసిడ్‌ అనే ఒక పరీక్షని నిర్వహించేవారు. అందులో పాజిటివ్‌ వస్తేనే వ్యాధి ఉన్నట్టు ధ్రువీకరించేవారు. ఇప్పుడు అలా కాదు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్టుగా సిటీ స్కానింగ్‌లో బయటకు వచ్చినా కరోనా వైరస్‌ సోకినట్టే లెక్కలు వేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా కొత్త కేసులు పెరిగిపోయాయి. ఒకే రోజు 242 మంది మరణించడానికి, 14,840 కేసులు వెలుగులోకి రావడానికి కొత్త విధానం ద్వారా గణించడమే కారణమైందని హువాన్‌ వైద్యులు వెల్లడించారు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌