ఆఫ్గనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం!

Published on Mon, 01/27/2020 - 16:19

కాబూల్‌: ఆఫ్గనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. తాలిబన్ల ఆధీనంలో ఉన్న సెంట్రల్‌ ఘాంజీ ప్రావిన్స్‌లో సోమవారం ఘటన జరిగింది. ఆఫ్గనిస్తాన్‌కు చెందిన ఏరియానా ఆఫ్గాన్‌ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం సోమవారం 1:40 గంటల సమయంలో కుప్పకూలినట్లుగా అధికారులు తెలిపారు. కాగా ప్రమాద సమయంలో విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారన్న విషయంపై స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా.. ఆఫ్గనిస్తాన్‌ జాతీయ విమాన సంస్థ అయిన అరియానా ఎయిర్‌లైన్స్‌ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది. తమ విమానాలన్నీ సురక్షితంగానే ఉన్నాయని పేర్కొంది. 

కాగా హిందూకుష్‌ పర్వతాల పాదాల చెంతనున్న ఘాంజీ ప్రావిన్స్‌లో శీతాకాలంలో తీవ్రమైన చలి కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఇక 2005లో ఇదే ప్రాంతంలో మంచు కారణంగా ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అంతేకాదు అనేకమార్లు సైన్యం విమానాలు కూడా కూలిపోయాయి. కాగా ప్రస్తుత విమాన ప్రమాదానికి గల కారణాలు వెల్లడికావాల్సి ఉంది.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ