పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సంతానం లేదని మహిళ ఆత్మహత్య
Published on Tue, 10/25/2016 - 17:39
పెళ్లై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు లేరని మనస్తాపానికి గురైన ఓ మహిళ మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా నకిరేకల్ కు మండలం గ్రామానికి చెందిన చెరుకూరి ధనలక్ష్మీ(26), వెంకటేశ్వరరావులు భార్యభర్తలు. వీరికి 2008లో వివాహం జరిగింది. నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇరువురు ఉద్యోగుల క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు.
కాగా ఆదివారం భర్త వెంకటేశ్వరరావు పని మీద స్వగ్రామానికి వెళ్లారు. మంగళవారం ఉదయం తిరిగివచ్చిన ఆయన తమ క్వార్టర్స్ తలుపు తట్టారు. ఎంతకూ తలుపు తీయకపోవడంతో తన వద్ద నకిలీ తాళం చెవితో తలుపులు తెరుచుకుని లోపలి వెళ్లి చూడగా భార్య ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించింది. దీంతో షాక్ కు గురైన వెంకటేశ్వరరావు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags