రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'మా దగ్గర ఆధారాలున్నాయి.. బయటపెడతాం'
Published on Mon, 05/30/2016 - 18:56
హైదరాబాద్: 'ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనాపాటి' అని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజ్యసభకు నలుగురు అభ్యర్థులను పోటీలో పెట్టి.. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను రూ. 40 కోట్లతో కొనడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన చంద్రబాబు... విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను కొనేందుకు డబ్బు వెదజల్లుతున్నారని ఆర్కే మండిపడ్డారు.
తమ నియోజకవర్గంలో ఒక్క ఎంపీపీ కొనుగోలుకే రూ. 3 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి తమ దగ్గర ఆధారాలున్నాయనీ, వాటిని సరైన సమయంలో బయటపెడతామని తెలిపారు. ఎమ్మెల్యేలను కొనగలరేమో గానీ, ప్రజలను కొనలేరని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.
#
Tags