amp pages | Sakshi

కుంటుపడిన ‘కుటుంబ ప్రయోజన’o

Published on Tue, 02/07/2017 - 04:00

  • రూ.13 కోట్లున్నా.. 3 వేలకు మించని ఎన్‌ఎఫ్‌బీఎస్‌ దరఖాస్తులు
  • బాధితులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సెర్ప్‌ సీఈవో లేఖ
  • సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం 1995 నుంచి అమలు చేస్తున్న జాతీయ కుటుంబ ప్రయోజన(ఎన్‌ఎఫ్‌బీఎస్‌) పథకానికి పెద్దగా స్పందన ఉండడం లేదు. పేద కుటుంబ యజమాని(పెద్ద) మరణిస్తే ఆ కుటుంబానికి ఈ పథకం కింద రూ.10 వేల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. అయితే.. ఈ పథకం పట్ల బాధిత కుటుంబాలకు పెద్దగా అవగాహన లేకపోవడం, ఆయా కుటుంబాలను గుర్తించాల్సిన రెవెన్యూ అధికారులు  పట్టిం చుకోకపోవడమే దరఖాస్తులు తగ్గడానికి కారణాలుగా తెలుస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2016–17)లో ఎన్‌ఎఫ్‌బీఎస్‌కి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.13 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో రాష్ట్రంలోని 13 వేల బాధిత కుటుంబాలకు సాయాన్ని అందించేందుకు వీలుంది.

    అయితే గత 10 నెలల్లో ఎన్‌ఎఫ్‌బీఎస్‌ కోసం ప్రభుత్వానికి అందిన దరఖాస్తులు 3 వేలకు మించలేదు. 750 దరఖాస్తులు ఆయా జిల్లాల డీఆర్వోల వద్ద, మరికొన్ని డివిజన్ల స్థాయిలో ఆర్డీవోల వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్‌ఎఫ్‌బీఎస్‌ కింద బాధిత కుటుంబానికి  ఆర్ధిక సాయాన్ని రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచాలని ఇప్పటికే సెర్ప్‌ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాస్తవానికి కేంద్రం ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి రూ.20 వేల చొప్పున మం జూరు చేస్తున్నప్పటికీ, ఎక్కువ మంది బాధితులకు సాయమందించే ఉద్ధేశంతో ఉమ్మడి రాష్ట్రంలో ఐదేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం రూ.10 వేలకు తగ్గించింది.

    బాధిత కుటుంబానికి కేంద్రం ఇచ్చిన మేరకు మొత్తం రూ.20 వేల చొప్పున లబ్ధిదారులకు మంజూరు ప్రతిపాదన సీఎం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎటువంటి ఆర్థిక సాయానికి నోచుకోని బాధిత కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, ఎన్‌ఎఫ్‌బీఎస్‌ పథకం పట్ల ఆయా కుటుంబాల సభ్యులకు అవగాహన కల్పించి, వెంటనే దరఖాస్తు చేసుకునే చర్యలు చేపట్టాలని సెర్ప్‌ సీఈవో నీతూకుమారి ప్రసాద్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు తాజాగా లేఖలు రాశారు.

Videos

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)