జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
రాష్ట్రానికి అదనంగా 277 మెగావాట్ల విద్యుత్
Published on Thu, 04/24/2014 - 02:41
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అదనంగా 277 మెగావాట్ల విద్యుత్ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. హర్యానా రాష్ట్రానికి చెందిన అరవల్లి విద్యుత్ కంపెనీ నుంచి విద్యుత్ను రాష్ట్రానికి కేటాయించినట్లు ఇంధన కో-ఆర్డినేషన్ సభ్యకార్యదర్శి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కేంద్రం నుంచి రాజభవన్కు వర్తమానం అందినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే హర్యానా కంపెనీ 226 మెగావాట్ల విద్యుత్ను ఆంధ్రప్రదేశ్కు సరఫరా చేస్తోందని తెలిపారు. తాజా కేటాయింపుతో 503 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థలు కరెంట్ కొనుగోలు కు సంబంధించిన ఒప్పందాలను చేసుకోనున్నాయి.
#
Tags