రాష్ట్రానికి అదనంగా 277 మెగావాట్ల విద్యుత్

Published on Thu, 04/24/2014 - 02:41

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అదనంగా 277 మెగావాట్ల విద్యుత్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. హర్యానా రాష్ట్రానికి చెందిన అరవల్లి విద్యుత్ కంపెనీ నుంచి  విద్యుత్‌ను రాష్ట్రానికి కేటాయించినట్లు ఇంధన కో-ఆర్డినేషన్ సభ్యకార్యదర్శి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కేంద్రం నుంచి రాజభవన్‌కు వర్తమానం అందినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే హర్యానా కంపెనీ 226 మెగావాట్ల విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్‌కు సరఫరా చేస్తోందని తెలిపారు.  తాజా కేటాయింపుతో 503 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థలు కరెంట్ కొనుగోలు కు సంబంధించిన ఒప్పందాలను చేసుకోనున్నాయి.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ