వృత్తి విద్యా కోర్సుల రీడిజైనింగ్‌

Published on Wed, 08/23/2017 - 02:19

- ఇంటర్‌ బోర్డు పాలకమండలి సమావేశంలో నిర్ణయం  
వచ్చే ఏడాది మరిన్ని కొత్త 
జూనియర్‌ కాలేజీలు: కడియం  
 
సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌లో వృత్తి విద్యా కోర్సులను మరింత పటిష్టం చేయాలని ఇంటర్‌ బోర్డు పాలక మండలి సంకల్పించింది. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి వెంటనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేలా రీడిజైన్‌ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం జేఎన్‌టీయూ, వైద్య, ఆరోగ్య శాఖ, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రెండు నెలల్లో ఈ కమిటీ తన నివేదిక ఇవ్వాలని, దానికనుగుణంగా మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సులను రూపొందించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. అలాగే డిమాండ్‌ లేని కోర్సులను తొలగించాలని నిర్ణయించింది. బోర్డు చైర్మన్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన మంగళవారం బోర్డు పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కడియం వెల్లడించారు. 
 
దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతాం...  
ఇంటర్‌ బోర్డును దేశంలోనే ఉత్తమమైనదిగా తయారు చేస్తామని కడియం చెప్పారు. ఇప్పటికే దేశంలో బెస్ట్‌ డిజిటలైజ్డ్‌ బోర్డుగా వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో తెలంగాణ ఇంటర్‌ బోర్డుకు అవార్డు లభించిందన్నారు. ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల అనుమతుల్లో బోర్డు కఠినంగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే అనుబంధ గుర్తింపు ఉన్న, లేని కళాశాలల జాబితాను వెబ్‌సైట్‌లో పెడతామన్నారు. ఇప్పటికే ఇంటర్‌ బోర్డులో 22 సర్వీస్‌లను ఆన్‌లైన్‌ చేశామని, త్వరలో మరిన్ని సేవలను ఆన్‌లైన్‌ చేస్తామన్నారు. విద్యాశాఖ చేపట్టిన పలు సంస్కరణల వల్ల జూనియర్‌ కాలేజీల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగిందన్నారు.

ఎక్కడెక్కడ జూనియర్‌ కాలేజీలు అవసరమో గుర్తించి, వచ్చే ఏడాది అక్కడ కొత్త కాలేజీలను మంజూరు చేస్తామని తెలిపారు. గతంలో మంజూరు చేసిన 59 కాలేజీల్లో పోస్టుల భర్తీకి సీఎం ఓకే చెప్పారని, దీంతో పోస్టుల భర్తీకి మార్గం సుగమమైందన్నారు. భవిష్యత్తులో ఇంటర్‌లోనూ ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశాలు చేపడతామని కడియం చెప్పారు. ఈసారి ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, ద్వితీయ భాషల సిలబస్‌ను మార్చుతున్నామని, వచ్చే ఏడాది ఈ మార్పులు అమల్లోకి వస్తాయన్నారు. సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, ఉన్నత విద్య కమిషనర్‌ వాణిప్రసాద్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్య డైరెక్టర్‌ కిషన్‌ పాల్గొన్నారు. 

Videos

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..!

కొడాలి నాని ఎన్నికల ప్రచారం.. బ్రహ్మరథం పట్టిన గుడివాడ ప్రజలు

జనంతో కిక్కిరిసిన మైదుకూరు

జగన్ గెలుపుకు అర్ధం..!

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోవడం ఖాయం

Photos

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)