amp pages | Sakshi

ప్రాజెక్టుల వద్దే విపక్షాలకు సమాధానం

Published on Thu, 07/28/2016 - 03:20

రాష్ట్ర ప్రణాళిక బోర్డు  ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

 

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేపట్టిన ప్రతి పనిని వ్యతిరేకించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి పనిచేస్తున్నాయని రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఇక్కడ తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి ప్రాజెక్టుల యాత్ర చేపడతామని, ప్రతిపక్షాలు, నిపుణులు ఎవరు వచ్చినా ప్రాజెక్టుల వద్దే సమాధానం చెబుతామన్నారు. కృష్ణా నదిపై ఆంధ్రా పాలకులు అక్రమ ప్రాజెక్టులు నిర్మించినా కాంగ్రెస్‌నేతలు డీకే అరుణ, మల్లు భట్టివిక్రమార్క ఎందుకు అడ్డుకోలేదని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పేరిట తెలంగాణలో 1.60 లక్షల ఎకరాలు ముంచుతున్నా బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి స్పందించలేదన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి భూములు ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు. జేఏసీ చైర్మన్ కోదండరాం కూడా ప్రాజెక్టులపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. 


హింసతో ప్రాజెక్టులను అడ్డుకునే యత్నం: గొంగిడి సునీత
కోటి ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించగా హింసాత్మక ఘటనలతో ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి ఏనాడూ నల్లగొండ జిల్లాను పట్టించుకోలేదని, ప్రాజెక్టులను అడ్డుకొని ప్రజల నోట్లో మట్టికొడితే భువనగిరి, ఆలేరు ప్రాంతాల్లో ఆ ఇద్దరూ అడుగుపెట్టలేరని హెచ్చరించారు. 

 

Videos

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

రౌడీయిజం సాగదు..టీడీపీ నేతలపై ఫైర్

లోక్ సభ స్థానాలపై లెక్కలు ప్రకటించుకున్న పార్టీలు

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)