amp pages | Sakshi

రోగులకు ‘పరీక్ష’!

Published on Mon, 08/25/2014 - 01:56

 సాక్షి, హైదరాబాద్:  ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు.. పేదోడికి పెద్దరోగం వస్తే ఆదుకొనే వైద్యాలయాలు. కానీ, ఇప్పుడు వాటికే పెద్ద జబ్బు చేసింది. నిపుణులైన డాక్టర్లు ఉన్నా.. సుశిక్షుతులైన సిబ్బంది ఉన్నా.. సరైన సదుపాయాలు లేక విలవిలలాడుతున్నాయి. నిరుపేద నిండుప్రాణాలు తన ప్రాంగణంలోనే పోతున్నా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నాయి. తెలంగాణకు గుండెకాయ లాంటి ఉస్మానియా, గాంధీ జనరల్ ఆస్పత్రుల్లో ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపగా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తేటతెల్లమైంది. ఎంఆర్‌ఐ, సీటీస్కాన్, వెంటిలేటర్స్, ఈసీజీ, టూడీఎకో, డయాలసిస్, కలర్‌డాప్లర్, ఎక్స్‌రే, ఎండోస్కోపి, కొలనోస్కోపి మిషన్లు ఈ రెండు ఆసుపత్రుల్లో తగినన్ని లేవు. ఫలితంగా సకాలంలో వైద్యం అందక రోగుల ప్రాణాలు పోతున్నాయి. గాంధీలో ఎంఆర్‌ఐ కోసం ఇప్పటికే 250 మందికిపైగా ఎదురు చూస్తుంటే, ఉస్మానియాలో 180 మందికిపైగా నిరీక్షిస్తున్నారు. ఈ పరీక్షల కోసం 15 నుంచి 30 రోజులు వేచి ఉండాల్సివస్తోంది. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే స్తోమత లేక సర్కారు ఆసుపత్రిల్లోనే రోజులు వెళ్లదీస్తున్న రోగులు చివరకు రోగం ముదిరి ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు.
 
 గాంధీలో రోజూ 250 మంది వెయిటింగ్
 
 గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగానికి రోజూ 200 నుంచి 300 రోగులు వస్తుండగా, వీరిలో చాలా మందికి ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ అవసరం. ఒక్కో సీటీ స్కాన్‌కు 20 నిమిషాలు పడుతుంది. ఇలా గంటకు ముగ్గురి చొప్పున రోజుకు సగటున 30 నుంచి 35 మందికి మాత్రమే టెస్టులు చేయగలరు.  కానీ రోగుల సంఖ్య రోజు వందల్లో ఉండడంతో ఇక్కడి సిబ్బంది ప్రతిరోజు  50కిపైగా సీటీ, ఎంఆర్‌ఐ టెస్టులు చేయాల్సి వస్తోంది. ఇలా ప్రస్తుతం 250 మందికిపైగా రోగులు ఇక్కడ తమ రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఎక్స్‌రే తీయించుకుంటే మరుసటి ఉదయం 11 గంటలకు గానీ ఈ ఆసుపత్రిలో రిపోర్టులు రోగుల చేతికి అందవు. ఇక పనిభారం ఎక్కువగా ఉండడం వల్ల యంత్రాలు తరచూ మొరాయిస్తున్నాయి. రేడియాలజీ విభాగానికి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టు(ఏఎంసీ) లేకపోవడం వల్ల రిపేరు చేయడానికి తీవ్ర జాప్యం జరుగుతోంది. రక్తప్రసరణ తీరును గుర్తించే కలర్‌డాప్లర్ టెస్ట్‌కు రెండు నెలలు వేచి ఉండాల్సి వస్తోంది. ఇక నెఫ్రాలజీ విభాగంలో ఐదు డయాలసిస్ యంత్రాలు ఉంటే కేవలం మూడే పనిచేస్తున్నాయి. అదనంగా ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ సమకూర్చాల్సిందిగా ఆస్పత్రి యాజమాన్యం డీఎంఈకి లేఖ రాసినా ఇప్పటి వరకు స్పందనే లేదు.
 
 ఉస్మానియాలో ఇలా...
 
 ఉస్మానియా ఆసుపత్రికి రోజూ రెండు వేలకుపైగా రోగులు వస్తుంటారు. ఇక్కడి క్యాజువాల్టీలో వెంటిలేటరే లేదు. ఇక ఏఎంసీ వార్డులో ఒకే వెంటిలేటర్ పని చేస్తుంది. రికార్డుల్లో 40కిపైగా వెంటిలేటర్లు ఉన్నా పనిచేస్తున్నవి మాత్రం 25కి మించి లేవు. ఇంత పెద్ద ఆస్పత్రిలో ఒకే ఒక్క ఎంఆర్‌ఐ మిషన్ ఉంది. దీంతో పరీక్ష  చేయాలంటే ఒక్కో రోగికి సగటున 30 నిమిషాలు పడుతోంది. దీంతో ఇక్కడ పేరు నమోదు చేయించుకున్న రోగులకు 12 రోజుల తర్వాతే టెస్టుల కోసం సమయం ఇస్తున్నారు. ప్రస్తుతం 180 మంది ఇక్కడ వెయింటింగ్ లిస్టులో ఉన్నారు. సీటీస్కాన్‌దీ అదే పరిస్థితి. ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ మిషన్ల కాలపరిమితి ముగియడంతో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. నెబులైజర్స్ లేక ఆస్తమా బాధితులు ఇబ్బంది పడుతున్నారు. రోగుల గుండెను రీయాక్టివ్ చేయడానికి ఉపయోగించే డి ప్రీవిలేటరూ అందుబాటులో లేదు. రోగుల నిష్పత్తికి తగినన్ని పరికరాలు సమకూర్చాలని ఆస్పత్రి అధికారులు ఏడాది క్రితం ప్రభుత్వానికి లేఖ రాసినా  స్పందన లేదు.  ఇక్కడ డిజిటల్ ఎక్స్‌రే సర్వీసులు అందుబాటులో ఉన్నా సాధారణ ప్రింట్‌లనే చేతికిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ఎక్స్‌రే తీయించుకుంటే సాయంత్రం ఐదు గంటలకు రిపోర్టు చేతికందుతుంది.
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)