అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘లండన్ స్కూల్’ కు ఓయూ ఫ్యాకల్టీ
Published on Thu, 09/03/2015 - 07:04
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చదివిన ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’లో అధ్యయనం చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీకి అవకాశం దక్కింది. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా 50 మందితో కూడిన అధ్యయన బృందాన్ని కేంద్రం ఎంపిక చేసింది. అంబేద్కర్ ఆ స్కూల్లో చదువుకునే రోజులకు, ప్ర స్తుత పరిస్థితులకు ఉన్న సామాజిక స్థితిగతులపై ఈ బృందం అధ్యయనం చేయనుంది.
ఓయూలో సోషల్వర్క్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న డాక్టర్ కసుప బాలరాజు ఈ బృందంలో ఒకరు కావడం విశేషం. అక్టోబర్ 24 నుంచి 31 వరకు ఈ అధ్యయనం కొనసాగనుంది. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన బాలరాజును ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#
Tags