amp pages | Sakshi

జ్వరానికి ‘చేప మందు’

Published on Sun, 08/20/2017 - 03:12

- మలేరియా వంటి వ్యాధులకు ఆరోగ్య శాఖ విరుగుడు
దోమల గుడ్లను తినే గంబూషియా చేప
మురికి కుంటలు, కాల్వల్లో పెంపకం
ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అమలు చేస్తున్న అధికారులు
 
సాక్షి, హైదరాబాద్‌: వర్షాకాలం వచ్చిందంటే చాలు జ్వరాలు పంజా విసురుతాయి. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా డెంగీ, చికున్‌ గున్యా, మలేరియా జ్వరాలు విజృంభిస్తూనే ఉన్నాయి. దోమలను అరికట్టడమే ఈ సమస్యకు పరిష్కారమని భావించిన అధికారులు నూతన విధా నాలను ఆచరణలో పెట్టనున్నారు. దోమల లార్వాల(గుడ్ల)ను తినే గంబూషియా చేపలను వైద్యారోగ్య శాఖ పెంచి, మురికి కుంటల్లో, కాలువల్లో వదులుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో దీన్ని అమల్లోకి తెచ్చింది. త్వరలోనే అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. 
 
ఏటా 3,500 మలేరియా కేసులు..
రాష్ట్రంలో ఏటా 3,500 మలేరియా కేసులు  నమోదవుతున్నాయి. 2017లో జనవరి నుంచి ఆగస్టు 19 వరకు 1,472 మలేరియా కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 400 కేసులు నమోదయ్యాయి. భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
 
ఎప్పటి నుంచో..
దోమల నివారణకు చేపలను వినియోగించడం మన దేశంలో 1928లో మొదలైంది. గంబూషియాను దోమల చేప (మస్కిటో ఫిష్‌)గా పిలుస్తారు. మురికి గుంటలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఇవి జీవిస్తాయి. ఒక గంబూషియా చేప తన జీవిత కాలంలో 1,200 గుడ్లు పెడుతుంది. మలేరియా విభాగం అంచనా ప్రకారం ప్రతి చేప రోజులో 360 గుడ్లు, లార్వాలను తింటుంది. దోమల గుడ్లు, లార్వాలు చేపలకు ఆహారం కావడం వల్ల కొత్త దోమలు వృద్ధి చెందవు. గంబూషియాలు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ బతుకుతాయి. వర్షాకాలం మురికి గుంటలు, కాల్వల్లో ఉంటూ దోమల లార్వాలను తినేస్తూ మానవులకు మేలు చేస్తాయి. 
 
తినడానికి పనికిరాని చేపలు..
గంబూషియా చేపలు చాలా చిన్నగా ఉంటాయి.  ఆహారంగా తీసుకునే సైజులో ఉండవు. పర్యావరణ పరంగా గంబూషియా చేపలతో మేలు ఎక్కువ. ఈ చేపలు గరిష్టంగా మూడు అంగుళాలకు మించి పెరగకపోవడం వల్ల వీటిని ఆహారంగా తీసుకునేం దుకు ఎవరూ ఇష్టప డరు. ఈ చేపల వల్ల దోమలకు తప్ప ఇతర జలచరాలకు ఎలాంటి నష్టం ఉండదు.
 
రాష్ట్రంలో మలేరియా కేసులు..
2015 11,880
2016 3,575
2017 1,472
  (ఆగస్టు 19 వరకు) 

Videos

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)