వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేటీఆర్ను కాపాడేందుకు నిజాలు దాచొద్దు
Published on Sat, 08/05/2017 - 03:34
మండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డికి సీపీఎం హితవు
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ మంత్రిగా ఉండి హిమాన్షు మోటార్ కంపెనీలో డైరెక్టర్గా కొనసాగడం చట్టవిరుద్ధమని అభియోగాలు వెల్లువెత్తుతుంటే, వాటికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి వాస్తవాలు దాటవేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. టీఆర్ఎస్కు చట్టాలు, రాజ్యాంగంపై గౌరవం ఉంటే వెంటనే కేటీఆర్తో మంత్రి పదవికి రాజీనామా చేయించి విచారణకు ఆదేశించాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. హిమాన్షు కంపెనీలో కేటీఆర్ వాటాలపై మొదటి సారి చర్చ వెలుగులోకి వచ్చినప్పుడు తనకు ఆ కంపెనీతో ఏడేళ్లుగా ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ పేర్కొన్నారని గుర్తుచేశారు.
పల్లా రాజేశ్వర్రెడ్డి మాత్రం కంపెనీ ఉన్నా యాక్టివిటీలో లేదంటున్నారని పేర్కొంది. 2014 ఎన్నికల అఫిడవిట్లో హిమాన్షు మోటారు కంపెనీలో 3 లక్షల షేర్లు ఉన్నాయని, వాటి విలువ రూ.30 లక్షలు అని పేర్కొన్నారని, కేటీఆర్ డైరెక్టర్ హోదాలో 2015–16 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటన్స్ను తన సంతకంలో సమర్పించారని వివరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాట్లాడితే తప్పులు ఒప్పు కావని, కేటీఆర్తో రాజీనామా చేయించి జవాబుదారీతనంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలని పేర్కొంది.
పల్లా రాజేశ్వర్రెడ్డి మాత్రం కంపెనీ ఉన్నా యాక్టివిటీలో లేదంటున్నారని పేర్కొంది. 2014 ఎన్నికల అఫిడవిట్లో హిమాన్షు మోటారు కంపెనీలో 3 లక్షల షేర్లు ఉన్నాయని, వాటి విలువ రూ.30 లక్షలు అని పేర్కొన్నారని, కేటీఆర్ డైరెక్టర్ హోదాలో 2015–16 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటన్స్ను తన సంతకంలో సమర్పించారని వివరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాట్లాడితే తప్పులు ఒప్పు కావని, కేటీఆర్తో రాజీనామా చేయించి జవాబుదారీతనంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలని పేర్కొంది.
#
Tags