చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘ట్రిపుల్’పై కేకేతో ముస్లిం లా బోర్డు ప్రతినిధుల భేటీ
Published on Wed, 01/24/2018 - 03:20
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఎంపీ కె.కేశవరావును ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు, ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీ తదితరులు మంగళవారం కలిశారు. ఈ మేరకు కేకే నివాసంలో బిల్లుపై కాసేపు చర్చించారు. ఇప్పటికే లోక్సభలో నెగ్గిన ట్రిపుల్ తలాక్ బిల్లులోని పలు అంశాలపై తమకు వ్యతిరేకత ఉందని లా బోర్డు సభ్యులు వెల్లడించారు. తమ అభ్యంతరాలను కేకేకు వివరించారు.
రాజ్యసభలో బిల్లు చర్చకు వచ్చినప్పుడు వీటిపై మాట్లాడాలని కోరారు. అయితే దీనిపై కేకే ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. ఈ సమావేశంపై కేకే ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే లోక్సభలో అనుసరించినట్టుగానే ట్రిపుల్ తలాక్ బిల్లు చర్చకు వచ్చినప్పుడు వాకౌట్ చేయాలనే యోచనతో ఉన్నట్టుగా తెలిసింది.
#
Tags