amp pages | Sakshi

ష్‌.. అప్పుడే ఏం మాట్లాడొద్దు!

Published on Tue, 05/23/2017 - 02:36

అమిత్‌ షా విమర్శలపై నేతలకు సీఎం సూచన
- ఆచితూచి స్పందించాలని నిర్ణయం
- పర్యటనతో ఇబ్బందేమీ లేదని భావన


సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పర్యటనను అధికార టీఆర్‌ఎస్‌ నిశితంగా పరిశీలిస్తోంది. ప్రధానంగా అమిత్‌ షా ప్రసంగాలు, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వంటి వాటిపై ఎట్టి పరిస్థితుల్లో తక్షణమే స్పం దించవద్దని, ఏది పడితే అది మాట్లాడొద్దన్న సూచనలు ఆ పార్టీ నేతలకు అందినట్లు సమాచారం. బీజేపీ అధ్యక్షుడి మూడ్రోజుల పర్యటన ముగిశాక ఆయన విమర్శలను పరిశీ లించి, సమీక్షించుకున్న తర్వాతే స్పందిం చాలని గులాబీ అధి నేత, సీఎం కేసీఆర్‌ నుంచి మంత్రులు, ఇతర నేతలకు ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది.

తర్వాత సంబంధాలెలా ఉంటాయో?
టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తి కావొస్తోంది. ఎన్నికలకు మరో రెండేళ్ల గడు వున్న క్రమంలోనే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇటీవల మరింత దూకుడు పెంచా రు. ఇందులో భాగంగా వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు సైతం కార్యరంగంలోకి దూకుతున్నాయి. అమిత్‌ షా పర్యటన కూడా ఇందులో భాగమని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అయితే ఆయన పర్యటనతో తమకేం ఇబ్బంది లేదన్న అభిప్రాయం టీఆర్‌ఎస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ మూడేళ్లలో కేం ద్రంలోని బీజేపీ సర్కారుతో టీఆర్‌ఎస్‌ సఖ్యత గానే ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వ వినతులనూ కేంద్రం తక్షణమే నెరవేరుస్తూ అడిగిన వెంటనే కాదనకుండా అన్ని పనులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ వస్తోంది.

ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా కేంద్రంతో స్నేహం గానే ఉంటోంది. సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ‘మిషన్‌ భగీరథ’ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వచ్చి వెళ్లారు. ఇటీవలే భూసేకరణ బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో చేపట్టనున్న విద్యుత్‌ ప్రాజెక్టులకు అనుమ తులు ఇచ్చింది. తాజాగా కొత్త సచివాలయ నిర్మాణానికి పరేడ్‌ గ్రౌండ్‌ను ఇవ్వడానికి కేంద్రం మొగ్గు చూపింది. ఈ సానుకూల అంశాల నేపథ్యంలో అమిత్‌ షా టూర్‌పై నేతలు అనవసరంగా విమర్శలు చేయొద్దని, ఆచి తూచి వ్యవహరించాలని సీఎం పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయ మని బీజేపీ నేతలు పదేపదే ప్రకటనలిస్తు న్నారు. కానీ  కాంగ్రెస్‌ బలంగా ఉన్న ప్రాంతా లపైనే బీజేపీ దృష్టి పెట్టిందన్న అభిప్రాయం గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. షా  స్పందనను బట్టే ప్రతిస్పందించాలని, నేతలెవరూ తొందరపడి మాట్లాడొద్దని నిర్ణయానికి టీఆర్‌ఎస్‌ వచ్చినట్లు సమాచారం.  మొత్తానికి షా పర్యటన తర్వాత టీఆర్‌ఎస్‌–బీజేపీ సంబంధాలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తికర చర్చ రెండు పార్టీల్లోనూ జరుగుతోంది.

Videos

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)