amp pages | Sakshi

తొలితరం ఉద్యమ మహిళ

Published on Fri, 07/20/2018 - 01:48

సందర్భం
జూన్‌ 6న రిపబ్లిక్‌ చానల్,  టైమ్స్‌ నౌ లేఖల దుమారం మొదలైన రోజుల్లోనే కొమురమ్మ మహబూబాబాద్‌లో చనిపోయిన వార్త తెలిసింది. తేరుకున్నపుడు ఆమె జ్ఞాపకాలు ముసురుకుం టూనే ఉన్నాయి గానీ రాయడానికి వీలు కాలేదు. మేము సికింద్రాబాద్‌ కుట్ర కేసులో సహ ముద్దాయిలం. సీపీఐఎంఎల్‌íసీఓసీ వరంగల్‌ జిల్లా తొలి నాయకులలో ఒకరైన బర్ల యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌మోహన్‌రెడ్డి, స్నేహలతల దళంలో వెంకటయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వినేవాళ్లం.

1974 మే 18న హనుమకొండలో అరెస్టు చేసి మే 20న నన్ను మరో నలుగురు విప్లవ రచయితలను సికింద్రాబాద్‌ మేజిస్ట్రేటు కోర్టులో హాజరుపరచినపుడు ఇచ్చిన ఎఫ్‌ఐ ఆర్‌లో కోటగిరి వెంకటయ్య, కొమురమ్మల పేర్లను చూశాం. ఎమర్జెన్సీ కాలంలో విరసం కార్యవర్గ సభ్యులం దరినీ మీసా కింద అరెస్టుచేసి రాష్ట్రం లోని ఆయా జైళ్లలో డిటెన్యూలుగా ఉంచారు. అట్లా మేం వరంగల్‌ జైలులో ఉండగా కొమురమ్మ అరెస్టయి ఇదే ఆవరణలోని మహిళా జైలుకు వచ్చిందని జైలు జవాన్ల ద్వారా తెలిసింది. అంతకుముందే కృష్ణానదీ తీరాన మంగళగిరి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కోటగిరి వెంకటయ్య మరణించినట్లు పత్రికల్లో చదివాం.

అప్పటికి ఆమె గర్భవతి. రహస్యప్రదేశంలో ఉన్నపుడు కోటగిరి వెంకటయ్యను, ఆమెను అరెస్టు చేశారని, ఇద్దరినీ వేరుచేసి ఆయనను ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపేసి, ఆమె కదలలేని స్థితిలో అనారోగ్యంతో ఉన్నందున అరెస్టు చేసి వరంగల్‌ జైలుకు తీసుకువచ్చారని తరువాత కాలంలో తెలిసింది. కొమురమ్మ జైలులోనే ప్రసవించింది. ఆమె పాప జైలులోనే పెరిగింది. 1976–77లో మేం చంచల్‌గూడ జైలులో ఉన్నప్పుడు సికింద్రాబాద్‌ కుట్రకేసు విచారణకు స్పెషల్‌ కోర్టుకు తీసుకెళ్లేవాళ్లు. ఈ కేసు విచారణ కోసమే కొమురమ్మను కూడా చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. అప్పటికే ఆ జైలులో డిటెన్యూలుగా విప్లవ రాజకీయ ఖైదీలుగా డా. వీణా శత్రుజ్ఞ, పీఓడబ్లూ్ల్య అధ్యక్షురాలు కె.లలిత, కరపత్రాలు పంచుతూ అరెస్టయిన పీఓడబ్లూ్ల్య అంబిక, స్వర్ణలత(అమరుడు మధుసూదన్‌రాజ్‌ సహచరి)ల సహచర్యం, ఆదరణ వల్ల కొమురమ్మ, ఆమె పాపకు కాస్త ఆరోగ్యం సమకూరి తేరుకున్నట్లున్నది.

కోర్టు వాయిదాలకు తీసుకువెళ్లేప్పుడే మొదటిసారి ఆమెను ఎస్కార్ట్‌ వ్యానులో చూడగలిగాను. ఆజానుబాహువు. దృఢకాయం. గంభీరమైన వ్యక్తిత్వం. ఎమర్జెన్సీ ఎత్తివేసి ఏర్పడిన ప్రజాస్వామిక వాతావరణంలో రాజకీయ ఖైదీలతోపాటు కొమురమ్మ కూడా విడుదలై మహబూబాబాద్‌ ప్రాంతంలో ప్రజాఉద్యమంలో పనిచేయడం ప్రారంభించింది. వరంగల్‌లో రాడికల్‌ విద్యార్థి సంఘం రెండో మహాసభలు(1978 ఫిబ్రవరి), గుంటూరులో రాడికల్‌ యువజన సంఘం ఆవిర్భావ మహాసభలు (1978 మే) జరిగి ‘గ్రామాలకు తరలండి’ కార్యక్రమం చేపట్టి వందలాది గ్రామాలు తిరిగే సందర్భంలో కొమురమ్మ రాడికల్‌ యువజన సంఘంలో పనిచేసింది. ఆమె పాపను స్నేహలత అనే పేరు పెట్టి హనుమకొండ హాస్టల్‌లో చేర్చాం. మహబూబాబాద్‌కు దగ్గరలోని కేసముద్రంలో రాడికల్‌ యువజన సంఘం సభలు కొమురమ్మ ఆధ్వర్యంలోనే జరి గాయి. వేలాదిమంది విద్యార్థి, యువజనులు, రైతాంగం తరలివచ్చారు.  సభలో కొమురమ్మ కూడా వక్త.

1989 ఫిబ్రవరిలో సికింద్రాబాద్‌ కుట్రకేసులో తీర్పు సందర్భంగా, బతి కుండి బహిరంగ జీవితంలో ఉన్న ముద్దాయిలందరం కలుసుకున్నాం. కేసు కొట్టివేసి మా అందరినీ నిర్దోషులుగా ప్రకటించారు. అప్పటికే కొమురమ్మ జీవితంలో చాలా కష్టాలు, విషాదాలు అనుభవించింది. చాలా విరా మం తరువాత ఆఖరుసారి ఆమెను 2015 జనవరి 27న కవి విమల ఇంటిలో కలవగలిగాను. సుప్రసిద్ధ చరిత్ర రచయిత ప్రొ‘‘ ఉమా చక్రవర్తి మహిళా రాజకీయ ఖైదీల మీద డాక్యుమెంటరీ చేయదలుచుకుని కొమురమ్మను పిలిపించింది.

ఆమె కష్ట సుఖాలు, ఆమె కుటుంబం గురించి విని చాలా బాధ కలిగింది. మళ్లీ ఒకసారి వచ్చి తన సమస్యలన్నీ చెప్పుకుంటానని తప్పకుండా వస్తానని మాట ఇచ్చింది కానీ రాలేకపోయింది. ఆ సమస్యలతో, అనారోగ్యం తోనే బహుశా మరణించి ఉంటుంది. మహబూబాబాద్‌లోని విప్లవ అభిమానులు, ప్రజాసంఘాలు ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారని ప్రజాసంఘాల కార్యకర్తల ద్వారా తెలిసింది. ఆమె కుటుం బానికి సంతాపం, ఆమె కోసం అశ్రునయనాల జోహార్లు చెప్పడానికి ఇంత ఆలస్యమైంది.

వ్యాసకర్త విరసం సంస్థాపక సభ్యులు
వరవరరావు

Videos

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)