amp pages | Sakshi

గోదావరి జలాలతోనే కరువు ప్రాంతాలకు సిరిసిరి!

Published on Sun, 07/28/2019 - 01:19

తెలంగాణలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోని తాగునీటి, సాగునీటి సమస్యల పరిష్కారంపై రాష్ట్ర అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగం ఉభయ రాష్ట్రాల ప్రజలను పులకింపజేసింది. ఒక యువ నాయకుడు ఇరురాష్ట్రాల సేద్యపునీటి ప్రాజెక్టులపై ఇంతటి లోతైన అధ్యయనం చేయడం ఆ ప్రాంతాల సమస్యలను పరిష్కరించడానికి నడుం బిగించడం, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జల యజ్ఞం కొనసాగింపుగా భావించాలి. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సఖ్యతను ఏర్పరుచుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల అభ్యున్నతికి నడుం బిగించడం సేద్యపునీటి సౌకర్యాల కల్పనకై చాలాకాలంగా పోరాడుతున్న మాలాంటి కార్యకర్తలకు ఎంతో ఉత్సాహం, ఆనందాన్ని కలిగిస్తోంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 301 టీఎంసీల జలాలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 80 టీఎంసీల జలాలు వినియోగించుకోవడం, దుమ్ము గూడెం, నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు ద్వారా 160 టీఎంసీల గోదా వరి జలాలను నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు తరలించడం లాంటి అంశాలు జలయజ్ఞంలో ఉన్నాయి. తెలంగాణలోని అనేక ప్రాజెక్టులను.. ప్రాణహిత, చేవెళ్లలాంటి ఎత్తిపోతల పథకాన్ని, హంద్రీ–నీవా లాంటి ఎత్తిపోతల పథకాన్ని దివంగత సీఎం వైఎస్సార్‌ చేపట్టి జలయజ్ఞం ద్వారా ఏమి చేయ వచ్చో నిరూపిస్తూ 86 ప్రాజెక్టుల్ని ప్రారంభించారు.

ఏపీ ఓటర్లు 23 అసెంబ్లీ స్థానాలకు తనను ఎందుకు పరిమితం చేశారో నేటికీ చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకున్నట్లు కనిపించడం లేదు. రాష్ట్ర అభివృద్ధికి తగు విధంగా ప్రతిపక్షనేతగా బాధ్యతలు నెరవేర్చకుండా కేసీఆర్‌ను ఒక ఆయుధంగా చూపించి తెలంగాణ భూభాగం నుండి కాకుండా ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలోనే గోదావరి జలాల ఎత్తి పోతలు జరగాలని సన్నాయి నొక్కులు నొక్కుతూ అపోహలు, సందేహాలు కల్పించే విధంగా అసెం బ్లీలో ప్రభుత్వానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. అనంతపురం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ గతంలో.. హంద్రీ–నీవా నుంచి 10 టీఎంసీల జలాలను అనం తపురం జిల్లాకు తరలించి పోతిరెడ్డిపాడు వైశాల్యం 44 వేల క్యూసెక్కులకు పెంచిన సందర్భంలో  వైఎస్‌ కృషి పట్ల సన్నాయి నొక్కులు నొక్కుతూ చంద్రబాబు చేతిలో ఆయుధంగా మారి ఈ జిల్లా ప్రజలకు తీరని నష్టం కలిగించేందుకు ప్రయత్నించారు. అదే పద్ధ తిలో నేడు కేశవ్‌ బాబుతో కలిసి గోదావరి జలాల మళ్లింపుపై వ్యతిరేకత వ్యక్తపరుస్తూ సభలో గందర గోళం సృష్టించడానికి ప్రయత్నించారు. ఈ సంద ర్భంలోనే వైఎస్‌ జగన్‌ గతంలో ఏ సీఎంకి లేనంత అవగాహనతో గోదావరి జలాల మళ్లింపుపై మనల్ని పులకరింపజేసే ఉపన్యాసాన్ని ఇచ్చారు.

నిజానికి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో రాయలసీ మకు ఓ పెద్దద్రోహం జరిగింది. అదేమంటే శ్రీబాగ్‌ ఒప్పందానికి తిలోదకాలు ఇవ్వడం, కృష్ణా పెన్నార్‌ ప్రాజెక్టును వ్యతిరేకించి నాగార్జున సాగర్‌ చేపట్టడం, అలాగే నేటి శ్రీశైలం స్థానంలోనే సిద్ధేశ్వరం ప్రాజెక్టుపై కోస్లా కమిటీ సూచనలను అమలు పరచక పోవడం జరిగింది. ఈ పొరపాటును నీలం సంజీవ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు చేపట్టడం ద్వారా  సవరించడా నికి చూశారు. వైఎస్సార్‌ పట్టుదలతో తెలుగుగంగ, శ్రీశైలం కుడికాలువ, గాలేరు నగరి, హంద్రీ–నీవా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలు తాగునీటికి, సాగునీటికి నోచుకోని ప్రాంతాల కోసం వినుగొండ ప్రాజెక్టు నిధులు కేటాయించి పరుగులు పెట్టించారు. బాబు నిర్లక్ష్యం వల్ల అవి నీటి కేటాయిం పులు లేకుండా కొనసాగుతున్నాయి. అవతల తెలం గాణలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్‌ సాగర్, స్టేజ్‌–1, స్టేజ్‌–2కు నీటి కేటాయింపులు లేకుండా ఇసుకలో లభించే మిగులు జలాలతో ముడిపెట్టి చేపట్టింది. వీటికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సేద్యపునీటి సాధికారత కల్పించారు. 

గోదావరి నుంచి వృథాగా వెళుతున్న నీటినుంచి ఈ ప్రాజెక్టులకు నికర జలాలను కేటాయించి వైఎస్సార్‌ ఆశయాల కొనసాగింపునకు కృషి చేయ వచ్చు. నేడు గ్రేటర్‌ రాయలసీమ.. కృష్ణా, గోదావరి డెల్టాల ఆయకట్టు రక్షణ పేరుతో గోదావరి జలాల మళ్లింపుపై చర్చలు జరుపుతున్నారు. నిజంగా గోదా వరి ఆయకట్టు స్థిరీకరణ, కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ, నాగార్జున సాగర్‌ కుడి, ఎడమ కాలువల స్థిరీకరణ జరిపి ఎగువన శ్రీశైలం నుండి చేపట్టిన సాగు, తాగునీటి పథకాలకు గోదావరి జలాల మళ్లింపులే శరణ్యం. వైఎస్‌ జగన్‌కి ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ప్రజలు ఏకంగా గొంతెత్తి ఆహ్వానించాలి.


ఇమామ్‌ 
వ్యాసకర్త కదలిక సంపాదకులు
మొబైల్‌ : 99899 04389

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)