అద్దమైన ప్రకృతి

Published on Fri, 10/26/2018 - 01:54

పూలు తాజాగా ఒక పూట లేదంటే ఒక రోజు ఉంటాయి. ఆ తర్వాత వాడి నేలరాలిపోతాయి. పూలను ఫొటోలుగా తీసి దాచుకుంటారు కొందరు. కానీ వాటిని ఆభరణాలుగా మార్చి, అలంకరించుకోవచ్చు అంటోంది హైదరాబాద్‌కి చెందిన నవ్యశ్రీ మండవ. పూలను అద్దాలలో పొందుపరిచి ఆభరణంగా రూపుకడుతోంది.

గ్లాస్‌ లిక్విడ్‌
గులాబీ, మల్లె, చామంతి, బంతి.. తాజా పువ్వులను, ఆకులను ఒక ప్రత్యేక పద్ధతిలో 2–3 వారాల పాటు ఎండబెడతారు. గ్లాస్‌ లిక్విడ్‌ని మౌల్డ్‌లో పోసి ఎండిన పువ్వులను అందులో పొందిగ్గా అమర్చి మరికొన్ని రోజులు ఉంచుతారు. దీంతో పువ్వుతో పాటు గట్టిపడిన గాజు అందాన్ని ఆభరణంగా మార్చుతారు. ‘అమెరికాలో ఈ ఆభరణాల తయారీ ఎప్పటి నుంచో ఉంది. ఆన్‌లైన్‌ క్లాసెస్‌ ద్వారా ఈ ఆర్ట్‌ని నేర్చుకొని వీటిని సొంతంగా తయారుచేస్తున్నాను’ అని చెబుతోంది నవ్యశ్రీ.

కాదేదీ అద్దానికి అనర్హం
పువ్వులు ఆకులే కాదు డ్రై ఫ్రూట్స్, కాఫీ గింజలు, టీ పొడి, కలప, పేపర్స్‌.. ఇలాంటి వేటినైనా ప్రకృతిలో ఉన్న ప్రతి అందాన్ని అద్దంలో బంధించవచ్చు. పెండెంట్, ఇయర్‌ రింగ్స్, బ్యాంగిల్, బ్రాస్‌లెట్, చోకర్స్‌ కూడా గాజుతో అందంగా తయారుచేయవచ్చు. పదిలంగా జ్ఞాపకాలని భద్రపరుచుకోవచ్చు. ఆత్మీయులకు వీటిని ప్రేమ కానుకలుగా ఇవ్వచ్చు.
వందల నుంచి వేల రూపాయల వరకు డిజైన్, పరిమాణం బట్టి ధరలు ఉన్నాయి.
www.instagram.com/srushti_collections_official

#

Tags

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ