amp pages | Sakshi

'నాకు వారసత్వంగా వచ్చింది విశ్వసనీయతే'

Published on Wed, 04/16/2014 - 14:17

కళ్యాణదుర్గం : రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులుగా పనిచేసినా ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్మరనీయుడై ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పిల్లల ఉన్నత చదువుల కోసం పొలాలు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.

వైఎస్ అధికారంలోకి వచ్చాక తాము ఉన్నత చదువులు అభ్యసిస్తున్నామని గర్వంగా చెప్పారన్నారు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ మారలేదన్నారు. 'ఎన్నికల తర్వాత తాను ఉండడు... తన పార్టీ ఉండదనే విషయం చంద్రబాబుకు తెలుసునని' అయినా అధికారం కోసం ఆయన ఏ అబద్ధం అయినా ఆడతారని వైఎస్ జగన్ అన్నారు.

మనం వేసే ఓటుతో మన తలరాతను మనమే మార్చుకుందామని జగన్ పిలుపునిచ్చారు. ఏ నేత అయితే పేదవాడి గుండెచప్పుడు వింటారో వారికే మీ మద్దతు పలకండని ఆయన కోరారు. మళ్లీ అధికారం కోసం చంద్రబాబు పట్టపగలే అబద్ధాలు ఆడుతున్నారని జగన్ మండిపడ్డారు. రోజుకో హామీతో ప్రజలను మభ్యపెడుతున్నారని చూస్తున్నారన్నారు. అమ్మకు అన్నం పెట్టలేనివాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట అని వ్యాఖ్యానించారు.

పొరపాటున నిజం చెబితే చంద్రబాబు తల వేయి ముక్కలు అవుతుందని శాపం ఉందని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడులా తాను అబద్ధాలు ఆడనని, విశ్వసనీయత అనే దానికి అర్థం కూడా బాబుకు తెలియదన్నారు. తనకు వారసత్వంగా వచ్చింది విశ్వసనీయతేనని జగన్ అన్నారు. ఇక ప్రమాదానికి గురై డాక్టర్ బెడ్ రెస్ట్ అని చెబితే ఉపాధి లేని ఆ పేదవాడికి ఆరోగ్యశ్రీ కింద మూడు వేలు ఇస్తామని జగన్ తెలిపారు. సొంత తమ్ముడి ఉద్యోంగం కోసం ఎలా కష్టపడతానో అలాగే మీ ఉద్యోగాలకు కష్టపడతానని జగన్ పేర్కొన్నారు. ఇక రాజన్న తనయుడిని చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వృద్ధులు సైతం తరలి వచ్చారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)