Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
Breaking News
రేపు తెలంగాణలో సుష్మా పర్యటన
Published on Fri, 04/25/2014 - 01:48
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన సుష్మాస్వరాజ్ తెలంగాణలో శనివారం (ఈ నెల 26న) సుడిగాలి పర్యటన జరపనున్నారు. పార్టీ పోటీ చేస్తున్న ఎనిమిది పార్లమెంటు స్థానాల పరిధిలో ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో రెండు విడతల్లో ప్రచారం చేయించాలని తొలుత భావించారు. సమయాభావం వల్ల మోడీ ఒక విడత ప్రచారానికే పరిమితవుయ్యూరు. నిజావూబాద్, కరీంనగర్, వుహబూబ్నగర్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలోనే ఆయున సభలు జరిగారుు. మిగిలిన స్థానాల పరిధిలో ప్రచార బాధ్యతను సుష్మాస్వరాజ్ తీసుకున్నారు.
శనివారం నగరానికి వస్తున్న ఆమె నాలుగు చోట్ల ఏర్పాటు చేసే బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు. ఇందులో నర్సాపూర్లో ఉదయుం 11 గంటలకు, వరంగల్ నగరంలో ఒంటిగంటకు, చౌటుప్పల్లో సాయుంత్రం 3 గంటలకు, హైదరాబాద్కు సంబంధించి గోషామహల్ స్థానం పరిధిలోని జుమ్మేరాత్బజార్లో ఐదుగంటలకు ఈ సభలను ఏర్పాటు చేశారు. కాగా, గోవా సీఎం మనోహర్ పారికర్ శుక్రవారం ప్రచారానికి వస్తున్నారు. అలాగే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ప్రచారం కోసం రానున్నారు.
Tags