రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నాన్న రుణం అలా తీర్చుకుంటాం
Published on Fri, 12/02/2016 - 22:55
- సినీ రచయిత ’సత్యమూరి’కి కుటుంబ సభ్యుల ఘన నివాళులు
- హాజరైన అభిమానులు, సహచరులు
వెదురుపాక (రాయవరం):
మాకెంతో ఆప్యాయతల్ని, అనురాగాల్ని పంచి పెట్టిన నాన్న రుణాన్ని ఆయనకు ఇష్టమైన సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా తీర్చుకుంటామని ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ తెలిపారు. మండలంలోని వెదురుపాకలో శుక్రవారం ప్రముఖ సినీ రచయిత స్వర్గీయ జి.సత్యమూర్తి ప్రథమ వర్ధంతిని ఆయన స్వగృహం సూర్యోదయంలో నిర్వహించారు. దేవీశ్రీప్రసాద్, ఆయన సోదరుడు సాగర్లు మాట్లాడుతూ నాన్నకు విద్య అంటే ఎంతో ఇష్టమని, అందుకే త్వరలో ట్రస్ట్ను ఏర్పాటు చేసి పేద మెరిట్ విద్యార్థులను ఆదుకుంటామన్నారు. 2017 మే 24న నాన్న పుట్టిన రోజు సందర్భంగా శాశ్వతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు. సత్యమూర్తి భార్య శిరోమణి, కుమారులు దేవీశ్రీప్రసాద్, సాగర్, కుమార్తె ప్రియదర్శినిలు సత్యమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకు ముందుగా దేవీశ్రీప్రసాద్, సాగర్లు తండ్రి సత్యమూర్తికి సంవత్సరీక పూజలు నిర్వహించారు. దేవీశ్రీప్రసాద్ కుటుంబ సభ్యులు, సత్యమూర్తి సహచరులు, అభిమానులు హాజరై నివాళులర్పించారు.
#
Tags