amp pages | Sakshi

నోరు నొక్కేశారు

Published on Thu, 09/14/2017 - 06:50

ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ముందు ఎవరూ మాట్లాడొద్దు
రాజధానికి భూములు ఇవ్వనివారికి మాట్లాడే హక్కే లేదు
రైతులను బెదిరించిన టీడీపీ నేతలు
నేలపాడు సదస్సులో మూగబోయిన రైతువాణి


సాక్షి, అమరావతి బ్యూరో/తుళ్లూరు రూరల్‌ :
అన్నదాతల నోరు నొక్కేశారు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన రైతులను అవమానించి పంపేశారు. రాజధానికి భూములివ్వని రైతులకు అసలు మాట్లాడే హక్కే లేదని హుకుం చేశారు. ఎవరైనా రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే హెచ్చరించారు. ప్రపంచ బ్యాంకు తనిఖీ విభాగానికి చెందిన నలుగురు బృంద సభ్యులు తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలో బుధవారం ఉదయం రాజధాని ప్రాంత రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభానికి ముందు తెలుగు తమ్ముళ్లు వేదిక ఎక్కి ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ముందు రైతులు ఎలా వ్యవహరించాలో పాఠాలు చెప్పారు. భూసమీకరణకు గానీ, రాజధాని నిర్మాణ విషయంలో గానీ వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇతర విషయాలు ఏ ఒక్కరూ ప్రస్తావించరాదన్నారు. ఎవరికైనా సమస్యలుంటే కలిసి చర్చించుకుందామని, రాజధాని నిర్మాణానికి అనుకూలంగా మాత్రమే మాట్లాడాలని ఆదేశించారు. దీంతో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన కొద్దిమంది రైతులు కూడా చేసేదేమీలేక మౌనంగా ఉండిపోయారు.

 కూలీల ఆశ.. అడియాసే..
అధికార పార్టీకి చెందిన రైతుల ప్రతినిధులు ప్రపంచబ్యాంకు ముందు తమ వాదనలు వినిపించారు. రాజధాని ఏర్పాటుతో అనేక రకాలుగా లబ్ధి పొందామని చెప్పుకొచ్చారు. కొండవీటి వాగుతో ముంపు ఉన్న మాట వాస్తవమంటూనే 1999లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సమస్య పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా వారి నోట పలుమార్లు రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు ఇస్తున్న పరిహార భృతి ప్రస్తావనకు వచ్చింది. ఈ సదస్సులో తమ గోడును వెళ్లబోసుకునేందుకు దాదాపు అధిక సంఖ్యలో వ్యవసాయ కూలీలు హాజరయ్యారు. కొందరు ప్రభుత్వం ఇస్తున్న పరిహార భృతి సరిపోవడంలేదంటూ వినతిపత్రాలు తెచ్చారు. వీరెవరూ ప్రపంచబ్యాంకు బృందానికి వినతి పత్రాలు ఇవ్వకుండానే వెనుదిరిగారు. కేవలం ముగ్గురు నాయకులు మాట్లాడటంతోనే సమయం ముగియడం.. తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన వారిని కనీసం ఒక్కరిని కూడా వేదిక సమీపానికి కూడా రానివ్వకపోవడంతో రైతులు, కూలీలు తీవ్ర అసహనంతో వెనుదిరిగారు.

ప్రపంచ బ్యాంక్‌ బృందం చర్చలు
సాక్షి, అమరావతి బ్యూరో : అమరావతి భూసమీకరణ విధానంపై రాజధాని రైతులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు బృందం బుధవారం సీఆర్‌డీఏ ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. మొత్తం రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజున సీఆర్‌డీఏ అధికారులతోపాటు రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక, నేలపాడు, ఎర్రబాలెం గ్రామాల్లో పర్యటించి రైతులతో భేటీ అయ్యింది.  ఈ సందర్భంగా ఉదయం సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులు ప్రతిపాదిత రాజధాని ప్రాంతంలో మౌలిక వసతులు, ల్యాండ్‌పూలింగ్, మాస్టర్‌ప్లానింగ్, నిధుల సమీకరణ, సంస్థాగత స్వరూపం తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు.  ఆయా ప్రాజెక్టులు చూపే సాంఘిక, పర్యావరణ ప్రభావాలపై కూడా బృంద సభ్యులు సునిశిత దృష్టి సారిస్తారు.  

పింఛన్ల ఎర
నేలపాడులో జరిగిన సమావేశానికి రైతులు, కూలీలు, మహిళలను పెద్ద ఎత్తున తరలించడానికి టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో చివరకు బెదిరింపు అస్త్రాన్ని ప్రయోగించారు. రాజధానిలో ఎవరికైతే ఇళ్లు కావాలో వారంతా సమావేశానికి రావాలని, పింఛన్లు కొనసాగాలంటే తప్పనిసరిగా హాజరవ్వాలని బెదిరించడంతో రాక తప్పలేదని సమావేశానికి వచ్చిన కొందరు రైతు కూలీలు, నిరుపేదలు చర్చించుకోవడం కనిపించింది. ఉద్ధండరాయునిపాలేనికి చెందిన పదుల సంఖ్యలో మహిళలను ఇలాగే తీసుకొచ్చారు. కుట్టు శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న మహిళలకు.. కుట్టు మిషన్లు కావాలంటే సమావేశానికి వచ్చి తీరాల్సిందేనని చెప్పారు.

అమరావతి అభివృద్ధికి సహకరించండి
రాజధానికి భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన ప్రతి రైతుకు, భూములపై ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కూలీలకు లబ్ధి చేకూరేలా భూసమీకరణ విధానాన్ని అమలు చేశామని స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. అమరావతిని ప్రపంచస్థాయి నగరాల్లో ఒకటిగా నిలిపేందుకు ఆర్థికంగా చేయూత అందించాలని ప్రపంచ బ్యాంకు బృందాన్ని కోరారు. నిధులు మంజూరుచేస్తే త్వరలోనే మా రాష్ట్రంలోనూ వాషింగ్టన్‌ వంటి నగరాన్ని నిర్మించుకుంటామన్నారు. – శ్రావణ్‌కుమార్, ఎమ్మెల్యే

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)