amp pages | Sakshi

గెలవడం కష్టమే

Published on Mon, 02/27/2017 - 22:58

చేతులెత్తేసిన అధికారపార్టీ నేతలు
– పట్టభద్ర ఎన్నికల్లో మింగుడుపడని అభ్యర్థి వ్యవహార శైలి
- కొంపముంచనున్న ప్రలోభాల పర్వం
– నేరుగా అధిష్టానానికి నివేదిక అందజేత
- కలిసికట్టుగా వైఎస్‌ఆర్‌సీపీ నేతల ప్రచారం
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పట్టభద్ర ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు చేతులెత్తేశారు. ఈ ఎన్నికల్లో మనం గెలవలేమని తేల్చిచెబుతున్నారు. ఇదే విషయాన్ని నేరుగా అధిష్టానానికి నివేదిక రూపంలో అందజేసినట్టు తెలిసింది. ఇందుకు ప్రధాన కారణం అభ్యర్థి వ్యవహారశైలి అంటూ వివిధ ఆధారాలతో ఈ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ అంశంపై దిద్దుబాటు కూడా సాధ్యం కాదని ఖరాఖండిగా తేల్చిచెప్పినట్టు అధికారపార్టీ నేతలు వివరిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం కలిసికట్టుగా ముందుకు సాగుతోందని కూడా ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో నేరుగా అధిష్టానం రంగంలోకి దిగినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదని అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు మూకుమ్మడిగా స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో పాటు బ్యాగ్‌లపై ఫొటోలతో అధికార పార్టీ అభ్యర్థి ఓటర్లను ప్రలోభ పెడుతున్న వైనంపైనా ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించినట్టు తెలిసింది. ఇదే జరిగితే తిప్పలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 
అధిష్టానానికి ఫిర్యాదు
అభ్యర్థి వ్యవహరిస్తున్న తీరుపట్ల అధికార పార్టీ నేతలందరూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పోటీలో నిలిచిన అభ్యర్థి వ్యవహరిస్తున్న తీరుతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేలే ఈ రకమైన ఫిర్యాదులు చేయడంతో ఏమి చేయాలో తెలియక అధిష్టానం తలలు పట్టుకుంటోంది. మొత్తం వ్యవహారంపై ఇన్‌చార్జి మంత్రి కనీసం ఎప్పటికప్పుడు దృష్టి సారించలేదని కూడా అధికారపార్టీ నేతలే మండిపడుతున్నారు. ఇన్‌చార్జి మంత్రిగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి తప్పులు సరిదిద్దే బదులుగా.. కనీసం పట్టించుకోలేదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇన్‌చార్జి మంత్రి వ్యవహారంపై అధిష్టానం కూడా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. 
 
కలిసికట్టుగా వైఎస్‌ఆర్‌సీపీ
మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు అందరూ కలిసికట్టుగా అభ్యర్థి గోపాల్‌ రెడ్డి కోసం పనిచేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థితో పాటు తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక హోదా డిమాండ్‌ నేపథ్యంలో చదువుకున్న పట్టభద్ర ఓటర్లు తమకే పట్టం కడతారని భావిస్తున్నారు. ప్రధానంగా ప్రత్యేక హోదా డిమాండ్‌ను బలంగా వినిపిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు చదువుకున్న ఓటర్లు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో గోపాల్‌ రెడ్డి చూపిన చొరవ కూడా ఆయనకు ప్లస్‌ పాయింట్‌గా మారిందనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌