వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
ముగ్గురి ఉసురు తీసిన అతివేగం
Published on Sun, 07/31/2016 - 11:16
మద్దిపాడు:
- ఆగి ఉన్న కాలేజీ బస్సును ఢీకొన్న కారు
-అందులో ఉన్న ముగ్గురు యువకుల దుర్మరణం
-తీవ్ర గాయాలతో బయటపడిన మరో యువకుడు
-వెంకట్రాజుపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై ఘటన
-మృతులు, క్షతగాత్రులది కందుకూరు సమీపంలోని గ్రామాలు
-వారంతా స్నేహితులు.. కన్నీటిపర్యంతమైన కుటుంబ సభ్యులు
మద్దిపాడు మండలం వెంకట్రాజుపాలెం జాతీయ రహదారిపై ముందు ఆగి ఉన్న కాలేజీ బస్సును కారు ఢీకొనడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి మృతి చెందగా మరో యువకుడు తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అందిన వివరాల ప్రకారం.. కందుకూరు సమీపంలోని ఆనందపురం పంచాయతీ పరిధి శ్యామీరపాలేనికి చెందిన పువ్వాడ యోహాన్బాబు(27) ఒంగోలులోని రావు అండ్ నాయుడు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్గా పని చేస్తున్నారు. ఇతనికి హైదరాబాద్లో ఓ పని ఉంది. అతను కారులో హైదరాబాద్ వెళ్తూ.. వెళ్తూ.. తన స్నేహితులు అదే గ్రామానికి చెందిన డీలర్ ఎస్కే షబ్బీర్(35), దూబగుంటకు చెందిన మున్నూరు మురళి(25)తో పాటు తన వద్ద పని చేసే ఎరుకమాటి వెంకట్రావును ఎక్కించుకున్నారు.
హైదరాబాద్లో పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామాలకు అదే కారులో శుక్రవారం రాత్రి పయనమయ్యారు. వెంకట్రాజుపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై ఒంగోలు హర్షిణీ కళాశాలకు చెందిన బస్సు విద్యార్థులను ఎక్కించుకునేందుకు ఆగే ప్రయత్నంలో ఉంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు.. ముందు ఆగి ఉన్న కాలేజీ బస్సును వేనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు డ్రైవ్ మురళి, షబ్బీర్, యోహాన్బాబుతో పాటు వెంకట్రావుకు తీవ్ర గాయాలయ్యాయి. షబ్బీర్, యోహాన్బాబు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మురళి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వెంకట్రావు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.
Tags