రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జాతీయ పోటీలకు తేలప్రోలు విద్యార్థులు
Published on Fri, 08/26/2016 - 20:12
తేలప్రోలు (ఉంగుటూరు):
జాతీయస్థాయి పోటీలకు తేలప్రోలు విద్యార్థులు ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు టి.ప్రసాదు శుక్రవారం తెలిపారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు జెడ్పీలో సబ్ జూనియర్స్ రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలలో కృష్ణాజిల్లా జట్టు తృతీయ స్థానం సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయులు రాంబాబు వివరించారు. తేలప్రోలు విద్యార్థులు కె.అనూష, జి.నవీన్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. సెప్టెబంరు 12 నుంచి 16 వరకు కేరళలోని తిరువనంతపురంలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. క్రీడాకారులను సర్పంచ్ భీమవరపు హరిణికుమారి, ఎస్ఎంసీ చైర్మన్ వింత రమేష్రెడ్డి, టి.శ్రీలత తదితరులు అభినందనలు తెలిపారు.
#
Tags