amp pages | Sakshi

అధికారులు మాట వినడం లేదు

Published on Mon, 07/25/2016 - 00:12

సాక్షి, విజయవాడ : ‘అధికార పార్టీలో ఉన్నామనే కాని.. కనీసం  కిందస్థాయి ఉద్యోగులైనా మా మాట వినడంలేదు..  మాతో సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.. ఇందిరమ్మ ఇళ్లు  ఇవ్వలేదు.. రైతు రుణమాఫీలోనూ అనేక లోపాలు ఉన్నాయి.. వాటిని సరి దిద్దకపోవడంతో ప్రజల్లో పార్టీ పలచనైపోతోందంటూ..’ జిల్లాలో  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రుల ముందు  ఏకరవు పెట్టారు. టీడీపీ విజయవాడ తూర్పు, పశ్చిమ, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు నియోజకవర్గాల సమన్వయకమిటీ సమావేశాలు విజయవాడలో జలవనరులశాఖ మంత్రి దేవి నేని ఉమామహేశ్వరరావు కార్యాలయం లో ఆదివారం వేర్వేరుగా జరిగాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు, జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) తదితరులు పాల్గొన్న ఈ సమావేశాలు వేడిగావాడిగా సాగాయి. ఒక దశలో నాయకులు అడిగే ప్రశ్నలకు మంత్రులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 
∙విజయవాడ తూర్పు నియోజకవర్గం సమావేశంలో అధికారులు ముందస్తు సమాచారం లేకుండా కృష్ణలంకలో ఇళ్లు తొలగించడంపై పలువురు సమన్వయ కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇష్టానుసారంగా ఇళ్లు తీసివేయడంతో ప్రజలు మనకు దూరం అయ్యారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇందుకు బాధ్యులైన అధికారులను బదిలీ చేయాలని పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు.  
∙పశ్చిమ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలని పలువురు నాయకులు  కోరారు. పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి జేఎన్‌ఎన్యూఆర్‌ఎం ఇళ్లు ఇప్పిం చేందుకు దరఖాస్తులంటూ రూ. 200 చొప్పున వసూలు చేస్తున్నారని, దీనివల్ల ప్రజల్లో పార్టీ చులకనై పోతోందని  మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. 
∙నూజివీడులో ఎంపీ మాగంటిబాబు, నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్రగడ వెంకటేశ్వరరావు మధ్య విభేదాలు నూజివీడు సమన్వయ కమిటీ సమావేశంలో చర్చ కు వచ్చాయి. కనీసం తమతో సంప్రదించకుండా, ఎంపీ  ప్రారంబోత్సవాలు, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ముద్రగడ వర్గం ఆరోపించింది.  
∙తిరువూరులో తాగునీరు లేక గ్రామాల్లో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని సభ్యులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గంలో డ్రెయినేజీæ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. 
∙ జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో రుణమాఫీ సరిగా జరగడం లేదని, అనేక మందికి రుణ విమోచన పత్రాలు వచ్చినా పేర్లు తప్పుగా వున్నాయని, కొంతమందికి అసలు పత్రాలే రాలేదని చెప్పారు. గ్రామాల్లోకి వెళ్లి రైతులకు సమాధానం చెప్పడం కష్టంగా ఉందని నాయకులు వాపోయారు.  మంత్రులు వారికి సర్ధిచెప్పారు.
 
పేదలను బతకనివ్వరా
టీడీపీ ప్రభుత్వ హయాంలో నగరంలో పేదలను బతకనివ్వరనే అభిప్రాయం బలపడుతోందని ఓ నియోజకవర్గం సమావేశంలో నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ నియోజకవర్గంలో జరిగిన, జరుగుతున్న అన్యాయం మరెక్కడైనా జరిగిందా చెప్పాలని మంత్రులను నిలదీసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నగరంలో పేదలకు సంబంధించిన ఇళ్లు మాత్రమే అధికారులకు కనిపిస్తున్నాయా? పెద్దలకు చెందిన ఆక్రమణలు నగరంలో ఎక్కడా లేవా? పాలకపక్షం సామాజికవర్గానికి చెందిన వారి ఆస్తులకు ఎక్కడైనా నష్టం వాటిల్లిందా? ప్రధాన మార్గంలో నట్టనడుమ ఉన్న భవంతులు, హోటళ్ల జోలికి మాత్రం వెళ్లరు. గుడులు, మసీదులు, ప్రభుత్వ కార్యాలయాలను మాత్రం అడ్డదిడ్డంగా కొట్టేస్తారు. కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వరు? ఇదేనా ప్రభుత్వ పాలన అని ఓ నాయకుడు నిలదీశారు. నగరంలో నేనూ నాయకుడినే. ప్రజాప్రతిని«ధినే. మా ప్రాంతంలోని వ్యాపారాలను తీసేశారు. నాకు, నా కుటుంబ సభ్యులకు చెందిన షాపులు పోయాయి. నెలకు కనీసం రూ.15 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. అదేవిధంగా రోడ్డు నిర్మాణం పేరిట ఆ ప్రాంతంలోని భవనాల ధరలను తగ్గించేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఏం మీ సామాజికవర్గానికి చెందిన వారి ఆస్తులుగాని, వ్యాపారాలు గాని నగరంలో ఎక్కడైనా, ఎవరివైనా దెబ్బతిన్నాయా చెప్పండని నిలదీయడంతో మంత్రులు పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు నోట మాట రాలేదని సమాచారం. నగరంలో మీ సామాజికవర్గానికి ఒక న్యాయం, బీసీలు, పేదలకు మరో న్యాయమా అనడంతో అన్నింటినీ చూద్దామంటూ సరిచెప్పడానికి మంత్రులు ప్రయత్నించారని తెలిసింది.

Videos

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)