amp pages | Sakshi

టెన్త్‌ ఫలితాలపై ఉత్కంఠ

Published on Wed, 05/03/2017 - 05:27

నేడు విడుదల

- కొత్త జిల్లాలో పురోగమనమా.. తిరోగమనమా?
- ప్రభావం చూపనున్న ఫిజిక్స్‌ పేపర్‌
- 67 కేంద్రాలు..11,125 మంది విద్యార్థులు హాజరు


పాపన్నపేట(మెదక్‌): మరి కొన్ని గంటల్లో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కాబోతున్నాయి.ఈ  తరుణంలో విద్యార్థులంతా ఊపిరి బిగపట్టి ఉత్కంఠతకు లోనవుతున్నారు. కొత్త జిల్లా ఏర్పాటు నేపథ్యంలో అధికారులు సైతం టెన్షన్‌కు లోనవుతున్నారు. గత యేడాది సాధించిన ఫలితాల కన్నా మెరుగైన లక్ష్యాన్ని సాధించాలనే తపన అన్ని వర్గాల్లో కన్పడుతోంది. అయితే ఈయేడు ఫిజిక్స్‌ పేపర్‌ విద్యార్థుల స్థాయికి మించి ఉండటంపై పలు విమర్శలు వ్యక్తం కాగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. పరీక్షల్లో ఐదు నిమిషాల ఆలస్యం  నిబంధన.. అరకొర సౌకర్యాలపై విమర్శలు వ్యక్తమయినప్పటికీ మెదక్‌ జిల్లాలో యే ఒక్క మాల్‌ప్రాక్టీస్‌ కేసు నమోదు కాకపోవడం.. పరీక్షలు అయిన కేవలం 33 రోజుల్లో ఫలితాలు ప్రకటించడం ఆశావాహ పరిణామాలు గానే భావించవచ్చు..

పతో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభం కాగా 30వ తేదీతో ముగిశాయి.   జిల్లా నుండి 11,125 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. మొత్తం 67 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇందుకుగాను ముగ్గురు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 20 మంది సిట్టింగ్‌ స్క్వాడ్‌లతో బాటు ఇతర డిపార్ట్‌మెంట్లకు చెందిన 67 మంది సిట్టింగ్‌ స్క్వాడ్‌లను నియమించారు. ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు పూర్తి అయినప్పటికీ.. ఫిజిక్స్‌ పేపర్‌ ప్రశ్న పత్రం కూర్పు పై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. ఇందు కోసం వేసిన నిపుణుల కమిటీ ఎట్టకేలకు  4 మార్కుల ప్రశ్న విద్యార్థుల స్థాయికి మించి ఉన్నట్లుగా నిర్ధారించింది. ఈ ప్రశ్న రాసేందుకు యత్నించిన విద్యార్థులకు 4 మార్కులు ఇస్తామని ప్రకటించింది. అయితే విద్యార్థులు మాత్రం తమకు అర్థం గాని ఆ ప్రశ్నను వదిలేశామని దీనివల్ల తమకు అన్యాయం జరిగి ..తమ జీపీఏ పై ప్రభావం చూపుతుందని.. అందరికీ మార్కులు కలపాలని ఆందోళన వ్యక్తం చేసినా ఫలితం లేకుండా పోయింది

గతేడాది 90.74 శాతం.. రాష్ట్రంలో 3 వ స్థానం
గత ఐదేళ్లలో పదో తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిస్తే మెదక్‌ జిల్లా ఫలితాల సాధనలో ఉత్థాన.. పతనాలు కనిపిస్తాయి. 2011–12 విద్యాసంవత్సరంలో అప్పటి ఉమ్మడి జిల్లాలో 41,292 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 37,483 విద్యార్థులు ఉత్తీర్ణులై 90.78 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 8వ స్థానం సంపాదించారు. 2012–13లో 40,842 మంది పరీక్షలు రాయగా కేవలం 27,757 మంది ఉత్తీర్ణులై జిల్లాలో 67.96 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 23 వ స్థానానికి దిగజారారు. 2013–14లో 40.090 మంది పరీక్షలు రాయగా 33,277 మంది ఉత్తీర్ణత నొంది 83.01 శాతం సాధించి, రాష్ట్రంలో 21 వ స్థానం నిలిచారు. 2014–15లో 42085 మంది పరీక్షలు రాయగా 36.603 మంది పాస్‌ కాగా, 86.97 శాతం ఉత్తీర్ణత సాధించి  జిల్లా రాష్ట్రంలో 3 వ స్థానం సంపాదించారు.. 2015–16 గతేడాది ఉమ్మడి జిల్లాలో 42,996 మంది పరీక్షలు రాయగా 39,016 మంది పాసై, 90.74 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో తిరిగి 3వ స్థానంలో నిలిచారు.అయితే కొత్త జిల్లాలో ఉత్తీర్ణత శాతం ఎలా ఉండబోతుందనే ఆసక్తి అన్ని వర్గాల్లో నెలకొంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)