వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
Published on Tue, 08/09/2016 - 22:44
కరీంనగర్ స్పోర్ట్స్ : సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు మంగళవారం స్థానిక జ్యోతి బాపూలే మైదానంలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్విప్ కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. బ్యాటింగ్ చేసి కరీంనగర్–సుల్తానాబాద్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికులు సర్వాయిపాపన్నను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 32 జట్లు హాజరయ్యాయని, మంగళవారం నుంచి ఈ నెల 17 వరకు పోటీలు జరుగుతాయని నిర్వాహకులు, సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గణగాని సత్యనారాయణగౌడ్ తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ రవీందర్ సింగ్, అర్జున అవార్డు గ్రహీత మాదాసు శ్రీనివాసరావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి, సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు మల్లేశంగౌడ్, పల్లె నారాయణగౌడ్, పర్శురాంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
#
Tags