వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీటీడీకి రూ.3 కోట్ల ఆస్తి రాసిస్తా !
Published on Tue, 07/28/2015 - 11:42
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముందుకు వస్తే తన రూ.3 కోట్ల విలువైన ఆస్తి రాసి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం కడిగిరి గ్రామానికి చెందిన పద్మావతమ్మ (70) వెల్లడించారు. సోమవారం తిరుమలకు వచ్చిన ఆమె విలేకర్లతో మాట్లాడారు. తనపేరు మీద, తన భర్త గోపాల్శెట్టి పేరు మీద కడిగిరి గ్రామంలో రూ. మూడు కోట్ల విలువైన భూమి ఉందని చెప్పారు.
ఆ భూమిని కొంత మంది ఆక్రమించుకున్నారని చెప్పారు. అధికారులు ముందుకు వస్తే... ఆ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా టీటీడీకి రాసిస్తానని, సంబంధిత పత్రాలను కూడా అందజేస్తానని ప్రకటించారు. అలాగే తన ఆరోగ్యం కుదుటపడేందుకు అధికారులు సాయం చేయాలని ఆమె టీటీడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
#
Tags