లారీ ఢీకొని పాత్రికేయుడి మృతి

Published on Fri, 12/23/2016 - 23:01

అనపర్తి (బిక్కవోలు) : 
సీనియర్‌ పాత్రికేయుడు సూరిశెట్టి రామకృష్ణ (38) విధి నిర్వహణలో భాగంగా ద్వారపూyì  వెళ్లి తిరిగి వస్తూ అనపర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాయవరం గ్రామానికి చెందిన రామకృష్ణ పదేళ్లుగా వివిధ పత్రికలు న్యూస్‌ చానళ్లలో పాత్రికేయుడిగా పనిచేశారు. శుక్రవారం తను పని చేస్తున్న స్యూస్‌ చానల్‌కు వార్తా సేకరణకు ద్వారపూడి వెళ్లిన ఆయన మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి వస్తూ అనపర్తి గ్యాస్‌ గొడౌన్ల వద్దకు వచ్చేసరికి అనపర్తి వైపు వేగంగా వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొనడంతో రామకృష్ణ రోడ్డుపై పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనపర్తి ఎస్సై కె.కిషోర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రాపురం ఏరియా అసుపత్రికి తరలించినట్టు ఆయన తెలిపారు. రామకృష్ణకు భార్య 3 ఏళ్ల కుమారుడు, ఏడేళ్ళ కుమార్తె ఉన్నారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే మండపేట, అనపర్తి నియోజకవర్గాల పాత్రికేయ సంఘ సభ్యులంతా ఘటనా స్థలానికి వచ్చి ఆయన మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ