పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

Published on Wed, 06/28/2017 - 02:34

నెల్లూరు(వేదాయపాళెం) : కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ రూరల్‌ మండలం కొండ్లపూడి గ్రామానికి చెందిన ఓ ప్రేమజంట మంగళవారం రూరల్‌ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డిని కలసి ఫిర్యాదు చేసింది. వివరాల మేరకు.. కొండ్లపూడి గ్రామానికి చెందిన ప్రశాంత్‌ నగరంలోని ఎంజీబీ మాల్‌లో పనిచేస్తున్నాడు. శిరీష ఇంటర్మీడియట్‌ చదువుతోంది. వీరిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల్లో పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో ఈ నెల 18న ఇంట్లో నుంచి పారిపోయి గొలగమూడిలో వివాహం చేసుకున్నారు.

వివాహం జరిగిన విషయం తెలుసుకొని ఇరుకుటుంబాల పెద్దలు తమను బెదిరిస్తున్నారని ఆ ప్రేమ జంట ఆందోళన వ్యక్తం చేసింది. తాము మేజర్లమని తెలిపారు. తమకు తమ తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. నెల్లూరు రూరల్‌ సీఐ దుర్గాప్రసాద్‌తో వీరి విషయమై డీఎస్పీ మాట్లాడారు. ప్రేమజంటకు రక్షణ కల్పించాలని ఆదేశించారు. ఈ మేరకు శిరీష, ప్రశాంత్‌లు రూరల్‌ పోలీసుల వద్దకు చేరారు

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ