amp pages | Sakshi

ప్చ్‌.. ఏం లాభం!

Published on Sun, 12/04/2016 - 21:04

- వచ్చిన కరెన్సీ మొత్తం రూ. 2వేల నోట్లే
- ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిన కరెన్సీ రూ. 700 కోట్లు
- ఇందులో రూ.600 కోట్లు రూ.2వేల నోట్లే
- ప్రత్యామ్నాయం లేక తీసుకుంటున్న జనం
- దాన్ని మార్చుకునేందుకు నానా తంటాలు 
- జనానికి తీరని నగదు కష్టాలు
 
రూ. 2వేల నోటు.. నగదు కొరత నేపథ్యంలో ఎవరి వద్ద చూసినా రూ.2వేల నోటే కనిపిస్తోంది.. కానీ ఏ లాభం.. ఆ నోటు జనం అవసరాలను ఏ మాత్రం తీర్చలేకపోతోంది.. జేబుల్లో డబ్బుందన్న మాటే కానీ దాన్ని మార్చుకునేందుకు ప్రజలు పడుతున్న తంటాలు అన్నీఇన్నీ కావు. .బ్యాంకుకు వెళ్లినా, ఏటీఎం వద్ద క్యూ ‍కట్టినా బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయం లేక ఈ నోటును తీసుకుంటున్నారు తప్ప దానికి ఆ స్థాయి ఆదరణ లభించడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే బయట చెల్లకుండా మిగిలిపోయిన  వెయ్యి, పాత ఐదొందల నోటుకు ప్రస్తుతం అంతటా లభిస్తున్న రెండు వేల నోటుకు పెద్ద తేడా ఉండడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ నోటును రద్దు చేశారు కాబట్టి దుకాణదారులు తీసుకోవడం లేదు.. అంత మొత్తంలో చిల్లర దొరకదు కాబట్టి ఈ నోటును వద్దంటున్నారు. 
 
కర్నూలు(అగ్రికల్చర్‌): రూ.500, 1000 నోట్ల రద్దు తర్వాత జిల్లాకు కొత్త కరెన్సీ దాదాపు రూ.700 కోట్లు వచ్చింది. ఇందులో రూ.600 కోట్ల వరకు రూ.2వేల నోట్లు మత్రమే వచ్చాయి. ఇంతవరకు జిల్లాకు కొత్త రూ.500 నోట్లు నామమాత్రంగానే వచ్చాయి. రూ.100 నోట్ల సరఫరా తగ్గిపోయింది. దీంతో మార్కెట్‌లో చిల్లర పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలుగా రూ.2000 నోట్లే ఇస్తున్నారు. పింఛన్‌ దారులు బ్యాంకుకు వెళ్తే ఇద్దరికి కలిపి రూ.2వేల నోటు ఇస్తున్నారు. మార్కెట్‌లో రెండు వేల నోట్లు తప్ప ఇతర నోట్లు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో రూ.2వేల నోట్లను మార్చుకోవడంలో వివిధ వర్గాల ప్రజలు పడుతున్న ఇక్కట్లు అన్ని, ఇన్నీ కావు. ఇంత పెద్దనోటు వద్దు బాబోయ్‌ అన్ని జనం మొత్తుకుంటున్నా.. రూ. 500, రూ.100 నోట్లు సరఫరా చేయాలని బ్యాంకర్లు కోరుతున్నా... ఆర్‌బీఐ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో జిల్లాకు వందలు, ఐదు వందల నోట్లు తెప్పించాలని బ్యాంకర్లు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తెస్తున్నారు. 
తీవ్రమవుతున్న చిల్లర కొరత
జిల్లాకు ఇటీవలే రూ.160 కోట్లు వచ్చాయి. ఇదంతా రూ.2వేల నోట్ల రూపంలోనే ఉంది. దీంతో చిల్లర సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు, పింఛన్‌దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దనోటుకు చిల్లర లభించకపోవడం, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇటీవల నందికొట్కూరులో ఓ వ్యక్తి అత్మహత్యాప్రయత్నం చేశారు.  జేబులో రెండువేల నోటున్నా టీ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. రూ.1000కి పైగా వ్యాపారం చేస్తే తప్ప వ్యాపారులు చిల్లర ఇవ్వడం లేదని ప్రజలు వాపోతున్నారు.  హోటల్‌కు వెళ్తే రూ.500, 100 నోట్లుంటేనా రావాలని చెబుతుండంతో జనం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
‘వంద’కు వెలుగు..
బ్యాంకింగ్‌ వర్గాల సమాచారం మేరకు జిల్లాలో దాదాపు రూ. 200 కోట్ల విలువైన 100 నోట్లున్నాయి. కాని ఈ స్థాయిలో 100 కనిపించడం లేదు. కర్నూలుతో సహా వివిధ ప్రాంతాల్లో వ్యాపారులు, మరికొందరు 100 నోట్లను భారీ ఎత్తున బ్లాక్‌ చేయడంతో కొరత మరింత తీవ్రమైంది. కొంత మంది 2వేల నోటుకు కమీషన్‌ విధానంలో చిల్లర ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. వ్యాపారులు వంద నోట్లను బ్లాక్‌ చేయడం వల్ల మార్కెట్‌లో వీటికి కృత్రిమ కొరత ఏర్పడింది. నేడు కరెన్సీలో వందనోట్లు రారాజుగా మారాయి.
 
రెండు వేల నోట్లను మార్చడం కష్టంగా మారింది.... విజయకుమార్‌ ఏపీఎంఐపీ ఉద్యోగి
ఇటీవల కలెక్టరేట్‌లోని ట్రెజరీ బ్రాంచీకి జీతం తీసుకునేందుకు వెళ్తే అన్ని 2వేల నోట్లు ఇచ్చారు. వీటిని మార్చుకోవడంలో తల ప్రాణం తోకకు వస్తోంది. ఎక్కడ అడిగినా వంద నోట్లు లేవంటున్నారు. ప్రభుత్వం అన్ని రకాల కరెన్సీ సరఫరా చేస్తే బాగుంటుంది. కాని అన్ని పెద్దనోట్లే వస్తుండటం వల్ల చిల్లర సమస్య తీవ్రమవుతోంది. రూ.2వేల నోటు జేబులో ఉన్నా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. 

#

Tags

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)