amp pages | Sakshi

రూ.433 కోట్ల మనీ స్కీం.. మింగింది కష్టార్జితం

Published on Tue, 08/04/2015 - 14:27

2 లక్షల మంది నుంచి రూ.433 కోట్లు వసూళ్లు
కేసులు పెడుతున్నా.. ప్రయోజనం శూన్యం
సొమ్ము తిరిగి రాక ఇబ్బందులు పడుతున్న జనం
నివాసాల్లో వీధికో మనీ సర్క్యులేషన్ స్కీంలు


కేవలం రోజుకు రూ.50 కడితే మూడేళ్లు దాటక ముందే రూ.లక్ష ఇస్తాం. రోజూ సంపాదించే సొమ్ములో రూ.50 లెక్కకాదు.  తక్కువ కట్టండి.. ఎక్కువ తీసుకోండి.. అంటూ పలు గొలుసు స్కీంల నిర్వాహకులు పేద, మధ్య, చిన్న, సన్నకారు రైతు కుటుంబాల వద్దకెళ్లి నమ్మించి నట్టేట ముంచుతున్నారు. ఇలాంటి స్కీంలను నమ్మి మోసపోయిన వేలాది మంది జనం పోలీసులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. పోలీసులు విచారిస్తున్నా.. మరో పక్క వీధికో మనీ స్కీంలు పుట్టుకొస్తునే ఉన్నాయి. వసూళ్లు చేసుకున్న వారు నిర్ణీత సమయంలో ఇవ్వకపోగా.. కనిపించకుండా మాయమతున్నారు.

నెల్లూరు: జిల్లావ్యాప్తంగా తొమ్మిది మనీ చైన్ స్కీంలు మాత్రమే వెలుగులోకి వస్తే.. మిగిలినవి గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నాయి. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని కొందరు బోగస్ సంస్థల పేరుతో కార్యాలయాలు ప్రారంభించి రూ.కోట్లు వసూళ్లు చేసుకుని పారిపోతున్నారు. గొలుసుకట్టు మోసాలపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేసినా ప్రయోజనం కనిపించలేదు. తాజాగా వెల్ఫేర్ సంస్థ ఒక్కొక్కరి నుంచి రోజుకు రూ.50 చొప్పున వసూలు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సమాచారం. వారికి మూడేళ్లలో రూ.75 వేలు చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆరునెలలుపైనే గడుస్తున్నా.. ఒక్కరూపాయి కూడా రాకపోవటంతో అనేకమంది బాధితులు వెల్ఫేర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అదే విధంగా రిచ్‌ఇండియా సంస్థ, మైల్యాండ్ ఎస్టేట్ ప్రైవేట్‌ లిమిటెడ్, కుబేరా కంపెనీల బాధితులు డిపాజిట్ చేసిన సొమ్ముకోసం తిరుగుతున్న వారిలో ఉన్నారు.

2 లక్షల మంది నుంచి రూ.433 కోట్లు
నెల్లూరు జిల్లాలో సుమారు 2 లక్షల మందికిపైగా గొలుసుకట్టు సంస్థలో డబ్బుకట్టి మోసపోయినట్లు తెలుస్తోంది. వీరి నుంచి సుమారు రూ. 433 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సమాచారం. అందులో భారత్ ప్రేమ్‌సదన్, న్యూవిజన్ ఫౌండేషన్, యూత్ అండ్ స్ట్రెంత్, ట్రోగాఫోన్ ఫార్మర్స్ సొసైటీ, హిమ్, యూత్ అలైవ్ క్రిష్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్, గోల్డ్‌క్విస్ట్ సంస్థలతో పాటు వీధుల్లో నివాసాల్లో చిన్నచిన్న స్కీంలు నడుపుతున్న వారు అనేకమంది ఉన్నారు. వారు ఏజెంట్ల ద్వారా అమాయకులకు ఫోన్లు చేసి మచ్చిక చేసుకుంటున్నారు. వారి నివాసానికి రెండు, మూడు పర్యాయాలు వెళ్లి స్కీంలో సభ్యులుగా చేర్చుకుంటున్నారు. ఆ నగదుతో ఇళ్లస్థలాలు, భూములు కొనుగోలు చేశారు. మరికొందరు పేర్లు మార్చి రియల్‌ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు.

రియల్‌ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందని కొన్నిసంస్థల ప్రతినిధులు జనాన్ని నేడు, రేపు అంటూ మభ్యపెడుతుంటే.. మరికొందరు బోర్డు తిప్పేసి కనిపించకుండా పోతున్నారు. గొలుసుకట్టు సంస్థలపై సీఐడీ అధికారులు జిల్లాలో 8 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొంత నగదును, కొంత మందిని అరెస్ట్ చేశారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో వివిధ గొలుసుకట్టు సంస్థలు ప్రజల నుంచి రూ.172 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుండగా.. అనధికారికంగా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. హిమ్ సంస్థ జిల్లాలో 18 వేలమంది ద్వారా రూ. 70 కోట్లు వసూలు చేసింది. భారత్‌ప్రేమ్ సదన్ సంస్థ 8,500 మంది ద్వారా రూ. 48కోట్లు, ట్రోగాఫాన్‌ఫార్మర్స్ సొసైటీ సంస్థ 2,120 మంది వద్ద నుంచి రూ. 12కోట్లు, యూత్ అండ్ స్ట్రెంత్ క్రిష్టియన్ వెల్ఫేర్ సంస్థ రూ. 11కోట్లు, న్యూవిజన్ ఫౌండేషన్ రూ. 21కోట్లు వసూళ్లకు పాల్పడింది. మరికొన్ని సంస్థలు మరో రూ 10కోట్లు వసూళ్లు చేశాయి.

అదే విధంగా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు మరో రూ. 261కోట్లు వసూలు చేసినట్లు చెబుతున్నారు. దాంతో పాటు అగ్రిగోల్డ్ సంస్థ  1.15లక్షల మంది నుంచి రూ. 246 కోట్ల డిపాజిట్లను వసూలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అగ్రిగోల్డ్ నుంచి డబ్బులు తిరిగి రాకపోవటంతో బాధితులు సోమవారం రోడ్డెక్కారు. వీరికి వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్ మద్దతు తెలియజేసి జాతీయ రహదారిపై బాధితులతో కలిసి ధర్నాకు దిగారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)