టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
కుమారుడి సమాధి వద్దే తండ్రి బలవన్మరణం
Published on Sun, 09/06/2015 - 13:23
ఆదిలాబాద్(కోటపల్లి): కుమారుడి మరణం తట్టుకోలేక ఓ తండ్రి కుమారుడి సమాధి వద్ద ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోటపల్లి మండలం షెట్పల్లిలోచోటుచేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన మోతె మదనయ్య(60)కు మోతె రవి(30) ఒక్కగానొక్క కుమారుడు. కుటుంబ కలహాల కారణంగా గతేడాది రవి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతి తట్టుకోలేక అప్పటి నుంచి ఓ పిచ్చివాడిలా తిరిగేవాడని స్థానికులు చెబుతున్నారు.
పురుగుల మందు తాగి కుమారుడి సమాధి వద్ద ఆదివారం విగతజీవిగా పడి ఉన్నాడు. మదనయ్య చనిపోయినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags