అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసం..
Published on Thu, 07/28/2016 - 00:21
డబ్బులతో పరారైన మాయలేడీ..
లబోదిబోమంటున్న బాధితులు
పార్వతీపురం : పట్టణంలోని బైపాస్ కాలనీ సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతిగహంలో కమాటీగా పనిచేస్తున్న ఓ మహిళ పలువురికి ఉద్యోగాలు కల్పిస్తానంటూ డబ్బులతో ఉడాయించింది. విషయం తెలుసుకున్న కురుపాం మండలం సీతంపేటకు చెందిన మర్రాపు గౌరమ్మ, పైడమ్మ, తెంటు సుజాత , వెలగాడ ఉమ, తెంటు లక్ష్మి, తదితరులు లబోదిబోమంటున్నారు. బాధితులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలుర వసతిగహంలో కమాటీగా పనిచేస్తున్న బొత్స దమయంతి ఈ ఏడాది మార్చిలో సీతంపేట వెళ్లి పలువురు మహిళలను కలిసి పరిచయం చేసుకుంది. కమాటీగా ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేలు తీసుకుంది. అయితే ఎప్పటికీ ఉద్యోగాల గురించి మాట్లాడకపోవడంతో బాధితులు డబ్బులు ఇమ్మని డిమాండ్ చేయడంతో బుధవారం ఇంటికి రమ్మని చెప్పింది. ఇంట్లో ఉండండి.. డబ్బులు తీసుకువస్తానని చెప్పి మాయలేడి పరారైంది. దీంతో బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
#
Tags