రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అబ్బుగూడెం అడవుల్లో మరో చిరుత సంచారం
Published on Sun, 08/28/2016 - 00:44
- ధ్రువీకరించిన అటవీశాఖ అధికారులు
చండ్రుగొండ: అబ్బుగూడెం అడవుల్లో మరో చిరుత పులి సంచరిస్తున్న ఆనవాళ్ళు లభించాయి. పాదాల గుర్తుల ఆధారంగా అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. గతనెల 3వ తేదీన ఇదే ప్రాంతంలోని అడవుల్లో రెండు చిరుత పులులను విషప్రయోగం చేసి హతమార్చిన విషయం తెలిసిందే. విధుల్లో భాగంగా అటవీప్రాంతంలో సిబ్బందితో కలిసి పర్యవేక్షిస్తున్న సెక్షన్ అధికారిణి దేవికి ఈ చిరుత పులి పాదాల గుర్తులు కనిపించాయి. సమాచారాన్ని ఆమె శాఖ ఉన్నతాధికారులకు అందించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సమీపంలో నీటివనరులున్న ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అబ్బుగూడెం అటవీప్రాంతంలో చిరుత సంచరిస్తోంది వాస్తవమేనని రామవరం రేంజర్ మధుసూదన్రావు పేర్కొన్నారు. మేకలు, పశువుల కాపరులు అటుగా వెళ్లవద్దని సూచించారు.
#
Tags