amp pages | Sakshi

పులిచింతలపై ప్రభుత్వాల నిర్లక్ష్యం

Published on Wed, 09/07/2016 - 22:29

రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ
 
అరండల్‌పేట: కృష్ణా డెల్టా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిర్వాసితుల సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని, పులిచింతలలో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉంచాలని రాజ్య సభ మాజీ సభ్యుడు రైతు నాయకులు డాక్టర్‌ యలమంచిలి శివాజీ తెలిపారు. అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో బుధవారం జిల్లా సీనియర్‌ సిటిజన్‌ హనుమంతరావు అధ్యక్షతన సభ నిర్వహించారు. పులిచింతలపై మొదట నుంచి ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు.  
 
కాంట్రాక్టర్లు,  అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఎవరికి వారు అందిన కాడికి వారు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు పనులు  ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం పులిచింతల గురించి మాట్లాడటం లేదని మేధావులు, రైతు సంఘాలు వాస్తవాల్ని ప్రజలకి తెలియజేసి ఉద్యమించాలని కోరారు. నల్లమడ రైతు సంఘం నాయకులు డాక్టర్‌ కొల్లారాజమోహన్‌ మాట్లాడుతూ కాంట్రాక్టర్ల పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, నిర్వాసితుల పట్ల ఉదాసీనత చూపుతుందన్నారు. చేయవలసిన పనులు చివరలో కూడా పూర్తి చేయడం లేదన్నారు.
 
తెలంగాణ ప్రభుత్వం ముంపు గ్రామాల కోసం అడుగుతున్న మొత్తాన్ని ఇచ్చి పులిచింతలలో నీరు నిల్వ ఉంచే ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. రైతు సంఘ నాయకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ పులిచింతలపై మరో రూ. 200 కోట్లు వెచ్చిస్తే కృష్ణా డెల్టా రైతులు రెండు పంటలు పండించుకోవచ్చన్నారు. పట్టిసీమకు ఇచ్చి ప్రాధాన్యత పులిచింతలకు ఇవ్వడం లేదన్నారు. సమావేశంలో రైతు నాయకులు  ఎం.రమేష్, వ్యవసాయ కూలిసంఘం నాయకులు నరసింహారావు, జొన్నలగడ్డ రామారావు, వై.ఎ.కాదరి, వెంకటప్రసాద్, కాటా సాంబశివరావు, సూరయ్యచౌదరి, హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Videos

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్...కేసు నమోదు చేసిన ఈడీ

ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుంది: సీఎం జగన్

ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్

కుప్పంలో కోట్లు కుమ్మరించినా చంద్రబాబుకు ఓటమి ?

సాయంత్రం గవర్నర్ ను కలవనున్న YSRCP నేతల బృందం

రాష్ట్ర విభజన పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ ఫోకస్

ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కూటమి గుండెల్లో ఓటమి భయం..

Photos

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)